AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 1000 బస్తాల ఉప్పు లోడ్ దిగింది.. కానీ కొన్ని బస్తాల నుంచి వాసన తేడాగా వచ్చింది.. చెక్ చేస్తే

గుజరాత్​లోని ముంద్రా పోర్టుకి ఇరాన్ నుంచి 1000 బస్తాల ఉప్పు లోడ్ వచ్చింది. ఆ లోడ్‌లోని కొన్ని బస్తాల్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులకు ఉప్పు అందింది. తనిఖీలు చేయగా...

Viral: 1000 బస్తాల ఉప్పు లోడ్ దిగింది.. కానీ కొన్ని బస్తాల నుంచి వాసన తేడాగా వచ్చింది.. చెక్ చేస్తే
Cocaine
Ram Naramaneni
|

Updated on: May 27, 2022 | 2:58 PM

Share

డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడం ఇప్పుడు సంబంధిత అధికారులకు, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఇందుకోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. ముందస్తు సమాచారం ఉంటే.. అధికారులు ఈ దందాలను ఆపగలుగుతున్నారు. తాజాగా గుజరాత్‌( Gujarat)లో భారీగా కొకైన్‌(cocaine) పట్టుబడింది. ‘ఆపరేషన్‌ నమ్కీన్‌'(Operation Namkeen)లో భాగంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రూ.500 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పు మాటున డ్రగ్స్ రవాణాకు తెరదీశారు కేటుగాళ్లు. ఇరాన్‌ నుంచి ఉప్పు పేరుతో మాల్ వచ్చిందనే.. పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో దాడులు చేశారు. 1,000 బస్తాల ఉప్పు లోడ్‌లో కొన్ని బస్తాల్లో కొకైన్ ఉందన్న పక్కా ఇన్ఫర్మేషన్‌తో.. మే 24 నుండి 26 వరకు మూడు రోజుల సుదీర్ఘ సోదాలు చేశారు. కొన్ని సంచుల్లో అనుమానాస్పద సరుకు ఉన్నట్లు గుర్తించారు. సదరు సంచుల నుంచి ప్రత్యేకమైన వాసన రావడంతో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు తరలించారు.  డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ అధికారులు పరీక్షలు నిర్వహించి ఈ శాంపిల్స్‌లో కొకైన్ ఉన్నట్లు నిర్ధారించారు. సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు 57 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. కొకైన్‌ రవాణాకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గతంలోనూ ఇదే పోర్టులో భారీ డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. DRI అధికారులు ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో లింక్‌లు సైతం ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంటిలిజెన్స్ సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా భారీ మొత్తంలో హెరాయిన్‌ బయటపడింది. ఆ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఏపీలోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకు చెందినవిగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించిన విషయం విదితమే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..