మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి.. పలువురికి గాయాలు

ఈ దాడిలో 11 మంది జవాన్లు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది డీఆర్‌ఎఫ్‌ పోలీసులు , డ్రైవర్‌ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు.

మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి.. పలువురికి గాయాలు
Maoists
Follow us

|

Updated on: Apr 26, 2023 | 3:55 PM

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. దంతేవాడ జిల్లా అరన్‌పూర్‌లో మావోయిప్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది డీఆర్‌ఎఫ్‌ పోలీసులు , డ్రైవర్‌ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల దాడిలో పోలీసుల వాహనం ధ్వంసమయ్యింది. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మందుపాతర పేల్చిన తరువాత మావోయిస్టులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనపై చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బాగేల్‌తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మావోయిస్టులపై పోరులో రాష్ట్రానికి పూర్తి సహకరం అందిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతిచెందిన వారిపట్ల తన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు.

దట్టమైన అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైన సమాచారంతో కూంబింగ్‌కు బయలుదేరారు డీఆర్‌జీ పోలీసులు. అదను చూసి పోలీసుల వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. పేలుడులో పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ మధ్య కాలంలో చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు ఇంత పెద్ద దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం అంటే ఏప్రిల్‌ 4 , 2021న దంతేవాడలో మావోయిస్టుల దాడిలో 22 మంది పోలీసులు చనిపోయారు.

మావోయిస్టుల దాడిలో 11 మంది జవాన్ల మృతిని ధృవీకరించారు చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బాగేల్‌. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దాడికి పాల్పడ్డ మావోయిస్టులకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టులపై యుద్దం అంతిమదశలో ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.