Cold Water: మీకూ చల్లని నీళ్లు తాగే అలవాటు ఉందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే
చాలా మందికి వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని వేళలా చల్లని నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా వేళా పాళా లేకుండా చల్లని నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం సమయంలో చల్లని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు..

తాగునీటి విషయంలో మన ఎంపిక భిన్నంగా ఉంటుంది. కొందరికి వేడినీరు, మరికొందరికి చల్లటి నీరు తాగడం అలవాటు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో తెలుసుకోవడం చాలా మంచిది. నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. హైడ్రేషన్తో పాటు మెరిసే చర్మాన్ని కాపాడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా మంచిది. తలనొప్పికి కూడా చికిత్స చేస్తుంది. అయితే ఏ నీరు తాగాలి అనేది ముఖ్యం. చల్లని నీరు రిఫ్రెష్గా అనిపించినప్పటికీ, ఇది మీ జీర్ణక్రియకు అంత ఉత్తమమైనది కాదు. ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థకు చల్లని నీరు ఎందుకు మంచిది కాదు?
చల్లటి నీరు లేదా ఐస్ క్రీమ్, సోడాలు వంటి ఏదైనా చల్లని ఆహారాలు జీర్ణవ్యవస్థకు అంత మంచివి కావు. ఇవి శరీరం లోపల అగ్ని రూప చర్యను తగ్గిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో జీర్ణ అగ్ని అంటారు. శరీరంలోని అగ్ని రూపం పనితీరు జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తి వంటి ముఖ్యమైన విధులకు కూడా సహాయ పడుతుంది. శరీరంలోపల వెచ్చని వాతావరణాన్ని కలిగించేలా చేస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి ఈ వ్యవస్థలన్నింటికీ అంతరాయం ఏర్పడుతుంది.
చల్లటి నీరు త్రాగినప్పుడు శరీరానికి ఏం జరుగుతుంది?
చల్లటి నీరు త్రాగినప్పుడు లేదా చల్లటి ఆహారం తిన్నప్పుడు అది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది మరింత మందగిస్తుంది. బరువును పెంచుతుంది. అజీర్ణం, ఉబ్బరం కలిగిస్తుంది. చల్లటి నీరు కడుపులో ఆమ్లాలు, పిత్తాన్ని పలుచన చేయడం ద్వారా అజీర్ణానికి కారణమవుతుంది. ఇంకా, కడుపులోని చల్లని ద్రవాన్ని వేడి చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది బద్ధకం, అలసట, అసౌకర్యానికి దారితీస్తుంది.
దీనికి పరిష్కారం ఏమిటి?
- జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చల్లని నీటిని ఎంచుకోవడానికి బదులుగా, రోజువారీ ఆహారంలో వెచ్చని నీటిని కూడా చేర్చుకోవాలి. భోజనంతో పాటు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
- భోజనానికి 30 నిమిషాల ముందు, ఆ తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి.
- జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి నిమ్మరసంతో వెచ్చని, హెర్బల్ టీలను త్రాగవచ్చు.
వెచ్చని నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?
చల్లటి నీటికి బదులు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. గోరువెచ్చని నీరు అంతర్గత ‘శుభ్రం’కి మంచిది. ఎందుకంటే ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గోరువెచ్చని నీటిని తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. టాక్సిన్స్ విడుదల చేయడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మానికి మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.