AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసుపు నీళ్లలో చియా సీడ్స్ కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా..? ఇదో మిరాకిల్..!

ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఊబకాయం ఒకటి. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వేగంగా పెరుగుతున్న బరువు గురించి ఆందోళన చెందుతున్న వారిలో మీరు కూడా ఒకరైతే, చియా విత్తనాల సహాయంతో మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. చియా విత్తనాలను పచ్చి పసుపు నీటితో కలిపి తాగడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిలోని పోషకాలు మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. ఈ పసుపు నీళ్లతో చియా సీడ్స్ కలిగి తాగితే అనేక లాభాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

పసుపు నీళ్లలో చియా సీడ్స్ కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా..? ఇదో మిరాకిల్..!
మీరు చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మూలవ్యాధులు ఎప్పటికీ రావు. ఖాళీ కడుపుతో చియా గింజల నీళ్లు తాగడవ వల్ల ఇతర సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2025 | 2:03 PM

Share

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. పసుపు నీళ్లలో చియా సీడ్స్ వేసుకుని తాగడం వల్ల శరీరం క్లీన్ అవుతుంది. తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. పసుపు నీళ్లలో చియా సీడ్స్ వేసుకుని తాగడం వల్ల చర్మం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. తద్వారా యవ్వనంగా కనిపించొచ్చు. చియా సీడ్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తాయి. పసుపులోని గుణాలు పేగులను శుభ్రం చేస్తాయి. ఈ రెండూ కలిపి తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లెక్స్, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి..

పసుపు నీళ్లలో చియా సీడ్స్ వేసుకుని తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీళ్లు తాగడం మంచిది. పసుపు నీళ్లలో చియా సీడ్స్ వేసుకుని తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా అలసట తగ్గుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. చియా సీడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు గుండె సమస్యలు రాకుండా చూసుకుంటాయి. చియా సీడ్స్‌లో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉంటాయి.

పసుపు నీళ్లల్లో ఈ గింజలు వేసుకుని తాగితే కొలెస్ట్రాల్ నియంత్రణ సాధ్యమవుతుంది. పసుపు, చియా సీడ్స్‌లోని గుణాలు కిడ్నీలను డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా కిడ్నీ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..