AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా…? అయితే, జరిగేది ఇదే!

భారతీయ సాంప్రదాయంలో పూజ, ధ్యానం, జపం చేయడం అనేది దైవంతో అనుసంధానమయ్యే పవిత్రమైన ప్రక్రియ. అయితే, నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ భాగమైపోయింది. చాలామంది పూజ చేస్తూనే ఫోన్ మాట్లాడటం లేదా పక్కన ఉంచుకుని తరచూ నోటిఫికేషన్లు చూడటం చేస్తుంటారు. ధర్మశాస్త్రాలు, జ్యోతిష్య నిపుణుల ప్రకారం పూజా సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై ఎలాంటి నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

పూజా సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా...? అయితే, జరిగేది ఇదే!
Mobile Phone During PrayerImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2026 | 7:22 PM

Share

పూజ చేసేటప్పుడు మనస్సు దేవునిపై లగ్నం కావాలి.. కానీ, నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు పూజా సమయంలో కూడా అంతరాయం కలిగిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పూజ సమయంలో ఫోన్ తరచూ మోగడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని పూజా ఫలం పూర్తిగా లభించదు అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు, పండితులు. పూజా సమయంలో సెల్‌ఫోన్‌ వాడితే ఏమౌతుంది..? పూజా నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఏకాగ్రత భంగం – పూజా ఫలం క్షీణత: పూజ ముఖ్య ఉద్దేశం మనస్సును ప్రశాంతంగా ఉంచి దేవునిపై లగ్నం చేయడం. పూజ మధ్యలో ఫోన్ రింగ్ కావడం, మెసేజ్ బెల్ మోగడం వల్ల దృష్టి మళ్లుతుంది. చంచలమైన మనస్సుతో చేసే పూజ వల్ల అనుకున్న ఫలితాలు దక్కవని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంత్రాలు చదవడానికి ఫోన్ ఉపయోగించవచ్చా?: అనేకమందికి పూజా పుస్తకాలు లేదా స్తోత్రాల పుస్తకాలు అందుబాటులో లేనప్పుడు ఫోన్‌లో చూసి మంత్రాలు, హారతి పాటలు చదివే అలవాటు ఉంటుంది. ఇలా మంత్రాలు లేదా పూజా విధానం తెలుసుకోవడానికి ఫోన్ వాడటం తప్పు కాదు. అయితే, మంత్రాలు చూస్తున్న సమయంలో నోటిఫికేషన్లు వచ్చినా లేదా మెసేజ్‌లు వచ్చినా వాటి వైపు దృష్టి మరల్చకూడదు. కేవలం పూజకు సంబంధించిన విషయాలకే పరిమితం కావాలి.

ఇవి కూడా చదవండి

పూజా పీఠంపై ఫోన్ పెట్టకూడదు: మొబైల్ ఫోన్‌ను మనం రోజువారీ జీవితంలో అన్ని ప్రదేశాలకూ తీసుకెళ్తుంటాము. దీనివల్ల దానిపై అశుచి, క్రిములు ఉండే అవకాశం ఉంది. అందుచేత దేవుని విగ్రహాలు ఉండే పీఠంపై కానీ, పూజా పళ్లెంలో కానీ ఫోన్‌ను నేరుగా ఉంచకూడదు. పూజ చేసే స్థలానికి కొద్దిగా దూరంలో ఒక శుభ్రమైన వస్త్రంపై లేదా పక్కన ఉంచుకోవాలి.

పాటించాల్సిన ప్రధాన నియమాలు: పూజ ప్రారంభించే ముందు మొబైల్ ఫోన్‌ను తప్పనిసరిగా సైలెంట్ మోడ్‌లో లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉంచాలి. పూజ మధ్యలో ఎలాంటి అత్యవసరం లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడటం, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం చేయకూడదు. ఫోన్‌ను తాకినట్లయితే చేతులు శుభ్రం చేసుకుని తిరిగి పూజా ద్రవ్యాలను తాకడం మంచిది.

సాంకేతికతను భక్తికి సాధనంగా వాడుకోవడంలో తప్పులేదు కానీ, అది దైవ ధ్యానానికి ఆటంకం కాకూడదు. పూజ చేసే కొద్ది సమయమైనా మొబైల్ దూరంగా ఉంచి పూర్ణ మనస్సుతో దేవుడిని ఆరాధించడం వల్ల మనశ్శాంతి, శుభ ఫలితాలు లభిస్తాయి.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు హిందూ సంప్రదాయాలు, పురాణాలకు ఆపాదించబడిన శ్లోకాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా వివరించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన ఫలితాలుగా కాకుండా సంప్రదాయ విశ్వాసాలుగా చూడాలి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us