AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Circles : కళ్లకింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ పద్దతులు పాటించి సింపుల్‌గా తొలగించుకోండి..

Dark Circles : ప్రతి ఒక్కరూ తమ కళ్ళు అందంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయినప్పటికీ మారిన జీవనశైలి తక్కువ నిద్ర,

Dark Circles : కళ్లకింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ పద్దతులు పాటించి సింపుల్‌గా తొలగించుకోండి..
Dark Circles
uppula Raju
| Edited By: Phani CH|

Updated on: May 29, 2021 | 10:14 AM

Share

Dark Circles : ప్రతి ఒక్కరూ తమ కళ్ళు అందంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయినప్పటికీ మారిన జీవనశైలి తక్కువ నిద్ర, ఒత్తిడి కారణంగా కళ్ళ క్రింద నల్లటి ముడతలు వస్తున్నాయి. ఇది మీకు అనారోగ్యాన్ని సూచిస్తుంది. మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ రెమిడీస్‌ని పాటించండి. నల్లటి వలయాల నుంచి బయటపడటానికి మీకు దోసకాయ, పెరుగు అవసరం. మొదట దోసకాయను కోసి అందులో పెరుగు కలపాలి. ఈ పేస్ట్‌ను బాగా కలిపి కళ్ళపై రాయండి. ఈ పేస్ట్‌ను కళ్ళపై పూయడం వల్ల కళ్ళు చల్లబడతాయి. ఈ పేస్ట్ నల్లటి ముడతలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఈ పేస్ట్‌ను వారానికి రెండు, మూడు సార్లు కళ్ళపై వేయాలి. ఈ పేస్ట్‌ను ఒక నెల పాటు నిరంతరం కళ్ళపై పూయడం వల్ల నల్లటి ముడతలు తొలగిపోతాయి.

మరో పద్దతిలో కంటి మీద దోసకాయ ముక్కను ఉంచాలి. దోసకాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని శీతలీకరణ ప్రభావం మీకు కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే కళ్ళను నల్లటి వలయాల నుంచి విముక్తి చేస్తుంది. చల్లగా ఉండే అంశాలు నల్లటి వలయాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ ఇ మొటిమలు, నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ స్కిన్ టోన్ ని కూడా కాపాడుతుంది. నల్లటి వలయాలు తగ్గించడానికి కలబంద జెల్ ను విటమిన్ ఇ నూనెతో కలపండి. మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ కళ్ళ చుట్టూ పూయాలి. ఉదయం చల్లటి నీటితో కడుక్కోండి. మంచి ఫలితం ఉంటుంది.

Polavaram Project: ఢిల్లీకి వెళ్లి ఆ నిధులు వచ్చేలా చూడండి.. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..

Green India Challeng: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..