AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana tourism: అరుణాచలం, వేలూరు, కాణిపాకం.. తెలంగాణ టూరిజం ప్యాకేజీ

హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటలో ఉంది. ఇది మిస్‌ అయితే అక్టోబర్‌లో మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఈ టూర్‌కు సంబంధించి...

Telangana tourism: అరుణాచలం, వేలూరు, కాణిపాకం.. తెలంగాణ టూరిజం ప్యాకేజీ
Telangana Tourism
Narender Vaitla
|

Updated on: Sep 09, 2024 | 3:42 PM

Share

తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం భక్తుల కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అరుణాచలంకు తెలంగాణ టూరిజం హైదరాబాద్‌-అరుణాచలం పేరుతో ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ ఏంటా ప్యాకేజీ.? ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటలో ఉంది. ఇది మిస్‌ అయితే అక్టోబర్‌లో మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఈ టూర్‌కు సంబంధించి పూర్తి వివరాలు..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* మొదటి రోజు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్‌ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.

* మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్‌ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* 4వ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు..

ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టూర్‌లో పెద్దలకు ప్యాకేజీని రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్‌ కవర్‌ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా.. రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం..
ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా.. రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం..
సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..
సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!