Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourism: హలో హైదరాబాదీలు… చలో ఊటీ.. రూ. 9వేలకే ఆరు రోజుల ట్రిప్‌. పూర్తి వివరాలు.

వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా

Tourism: హలో హైదరాబాదీలు... చలో ఊటీ.. రూ. 9వేలకే ఆరు రోజుల ట్రిప్‌. పూర్తి వివరాలు.
Telangana Tourisam
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 04, 2023 | 5:50 PM

వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా ఈ ట్రిప్‌ సాగుతుంది. బెంగళూరు – ఊటీ – మైసూర్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

మొదటి రోజు: టూర్‌లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్‌ ప్రారంభమవుతుంది. యాత్రి నివాస్‌ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు, బషీర్‌బాగ్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణించి ఉదయం బెంగళూరు చేరుకుంటారు.

రెండో రోజు: రెండో రోజు బెంగళూరులో లోకల్‌ సైట్‌ విజిటింగ్‌ ఉంటుంది. ఇందులో భాగంగా బుల్‌ టెంపుల్‌, లాల్‌ బాగ్‌, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్‌ టెంపుల్‌ విజిటింగ్‌ ఉంటుంది. రాత్రి బెంగళూరులోనే బస చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడో రోజు: ఇక మూడో రోజు తెల్లవారుజామున 4 గంట‌ల‌కు ఊటీ బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. భోజనం త‌ర్వాత రాత్రి ఊటీలో బస ఉంటుంది.

నాలుగో రోజు: టూర్‌లో నాలుగో రోజు ఉదయం మైసూర్ వెళ్తారు. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. అనంత‌రం బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి భోజనం, మైసూరులో బస ఉంటుంది.

ఐదో రోజు: ఐదో రోజు ఉదయం 7 గంట‌ల‌కు మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా చాముండేశ్వరి ఆలయం, మైసూరు మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ చూడొచ్చు. అనంతరం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి మైసూర్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. వ

ఆరో రోజు: ఆరో రోజు తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైద‌రాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధర విషయానికొస్తే..

ఇక ఈ టూర్‌ ధర విషయానికొస్తే.. నాన్‌ ఏసీ బస్‌ ప్యాకేజీ పెద్దలకు రూ. 9,900, 5 నుంచి 12సంవత్సరాల పిల్లలకు రూ.7,920 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో వోల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ వసతి కవర్ అవుతుంది.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌