AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourism: హలో హైదరాబాదీలు… చలో ఊటీ.. రూ. 9వేలకే ఆరు రోజుల ట్రిప్‌. పూర్తి వివరాలు.

వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా

Tourism: హలో హైదరాబాదీలు... చలో ఊటీ.. రూ. 9వేలకే ఆరు రోజుల ట్రిప్‌. పూర్తి వివరాలు.
Telangana Tourisam
Narender Vaitla
|

Updated on: Jun 04, 2023 | 5:50 PM

Share

వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా ఈ ట్రిప్‌ సాగుతుంది. బెంగళూరు – ఊటీ – మైసూర్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

మొదటి రోజు: టూర్‌లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్‌ ప్రారంభమవుతుంది. యాత్రి నివాస్‌ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు, బషీర్‌బాగ్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణించి ఉదయం బెంగళూరు చేరుకుంటారు.

రెండో రోజు: రెండో రోజు బెంగళూరులో లోకల్‌ సైట్‌ విజిటింగ్‌ ఉంటుంది. ఇందులో భాగంగా బుల్‌ టెంపుల్‌, లాల్‌ బాగ్‌, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్‌ టెంపుల్‌ విజిటింగ్‌ ఉంటుంది. రాత్రి బెంగళూరులోనే బస చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడో రోజు: ఇక మూడో రోజు తెల్లవారుజామున 4 గంట‌ల‌కు ఊటీ బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. భోజనం త‌ర్వాత రాత్రి ఊటీలో బస ఉంటుంది.

నాలుగో రోజు: టూర్‌లో నాలుగో రోజు ఉదయం మైసూర్ వెళ్తారు. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. అనంత‌రం బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి భోజనం, మైసూరులో బస ఉంటుంది.

ఐదో రోజు: ఐదో రోజు ఉదయం 7 గంట‌ల‌కు మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా చాముండేశ్వరి ఆలయం, మైసూరు మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ చూడొచ్చు. అనంతరం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి మైసూర్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. వ

ఆరో రోజు: ఆరో రోజు తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైద‌రాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధర విషయానికొస్తే..

ఇక ఈ టూర్‌ ధర విషయానికొస్తే.. నాన్‌ ఏసీ బస్‌ ప్యాకేజీ పెద్దలకు రూ. 9,900, 5 నుంచి 12సంవత్సరాల పిల్లలకు రూ.7,920 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో వోల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ వసతి కవర్ అవుతుంది.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు