AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: చవకైన ప్యాకేజీ.. హరిద్వార్‌, రిషికేశ్‌ సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనం..

భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి IRCTC గొప్ప ప్యాకేజీలతో ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ కింద మీరు ఆగ్రా, మధుర, బృందావన్, హరిద్వార్, రిషికేశ్, వైష్ణో దేవిని సందర్శించవచ్చు. మీకు అందుబాటు ధరలోనే 8 రాత్రులు, 9 రోజుల ప్రయాణం.

IRCTC Tour Package: చవకైన ప్యాకేజీ..  హరిద్వార్‌, రిషికేశ్‌ సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనం..
ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఉదయం రెండు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
Jyothi Gadda
|

Updated on: May 24, 2023 | 5:40 PM

Share

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్‌ రైల్వే అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. IRCTC రోజువారీ టూరిజంతో పాటు మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్యాకేజీలు అందరికీ అందుబాటు బడ్జెట్‌లో ఉండేలా రూపొందిస్తోంది. దీని కింద వారు అనేక లగ్జరీ సౌకర్యాలను కూడా పొందుతారు. కాబట్టి మీరు ఈసారి మాతా వైష్ణోదేవిని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్టయితే, IRCTC టూర్ ప్యాకేజీ మీకు బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో, ప్రయాణీకులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో వైష్ణో దేవితో పాటు ఆగ్రా, మధుర, హరిద్వార్, రిషికేశ్‌లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ 8 రాత్రులు, 9 రోజులు ఉంటుంది. ఇది జూన్ 10 నుండి ప్రారంభమవుతుంది. ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఈ రైలు జూన్ 10వ తేదీన సింద్రాబాద్ నుంచి నేరుగా అగర్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ప్రయాణీకులు ఆగ్రా, మధుర, బృందావన్‌లోని వివిధ ప్రదేశాలను బస్సులో సందర్శించవచ్చు. ఆ తర్వాత ఈ రైలు నేరుగా కత్రాకు బయలుదేరుతుంది. యాత్రికులు ఇక్కడ మాతా వైష్ణో దేవి దర్శనం చేసుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో ప్రయాణీకులను హరిద్వార్, రిషికేశ్‌లకు తీసుకువెళతారు. ఇక్కడ వారు వివిధ మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.

ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు ముందుగా ఆగ్రాలోని తాజ్ మహల్, మథురలోని కృష్ణ జన్మభూమి(మధుర), బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం, ప్రేమ మందిర్, కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయం, హరిద్వార్‌లోని మానసా దేవి, హర్ కీ పౌరి, లక్ష్మణ్ ఝులాను సందర్శించవచ్చు. రిషికేశ్‌లో రిషికేశ్, రామ ఝుల.

ఇవి కూడా చదవండి

ఇక IRCTC ద్వారా టిక్కెట్ల బుకింగ్‌ వివరాలు పరిశీలించినట్టయితే..

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో మొత్తం 700 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్‌కు 460 సీట్లు, థర్డ్ ఏసీకి 193 సీట్లు, సెకండ్ ఏసీకి 48 సీట్లు ఉన్నాయి. ప్రయాణికులు మూడు కేటగిరీల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్. ఎకానమీ క్లాస్ ధర రూ.15,435, స్టాండర్డ్ క్లాస్ ధర రూ.34,735, కంఫర్ట్ క్లాస్ ధర రూ.32,480గా నిర్ణయించారు.

ప్యాకేజీలో సౌకర్యాలు..

ప్రయాణంలో ఆహారం, కూల్‌డ్రింక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, అల్పాహారం IRCTC ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. ఇది కాకుండా, ప్రయాణీకుల ప్రయాణ బీమా, హోటల్ ఛార్జీలు కూడా ఇందులోకి వర్తిస్తాయి. మరింత సమాచారం కోసం IRCTC విండో ఓపెన్‌ చేశారు. ప్రయాణికులు ఏదైనా సమాచారం కోసం 8287932228, 8387932229 నంబర్లను కూడా సంప్రదించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us