AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: కాశీ, సారనాథ్, ప్రయాగ చూడాలనుకుంటున్నారా.. తక్కువ ధరతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ వివరాలు

ఈ ప్యాకేజీని జై కాశీ విశ్వనాథ్ గంగే పేరుతో అందిస్తోంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులు  తక్కువ ధరతో ఈ ప్యాకేజీని అందిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభయ్యే ఈ టూర్ ప్యాకేజీ.. కాశి విశ్వేశ్వరుడు దర్శనంతో పాటు సారనాథ్, ప్రయాగ వంటి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

IRCTC Tour: కాశీ, సారనాథ్, ప్రయాగ చూడాలనుకుంటున్నారా.. తక్కువ ధరతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ వివరాలు
Jai Kashi Vishwanath Gange
Surya Kala
|

Updated on: Mar 15, 2023 | 10:43 AM

Share

భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దేశంలోని  పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాలకు, వివిధ పర్యాటక ప్రాంతాలకు స్పెషల్ టూర్ ప్యాకేజీలను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో IRCTC టూరిజం శాఖ తెలుగువారికోసం హిందువుల పవిత్ర క్షేత్రం… పురాతన నగరం వారణాసికి వెళ్లాలనుకునే వారికి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని జై కాశీ విశ్వనాథ్ గంగే పేరుతో అందిస్తోంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులు  తక్కువ ధరతో ఈ ప్యాకేజీని అందిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభయ్యే ఈ టూర్ ప్యాకేజీ.. కాశి విశ్వేశ్వరుడు దర్శనంతో పాటు సారనాథ్, ప్రయాగ వంటి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  1. జై కాశీ విశ్వనాథ్ గంగే టూర్ లో సికింద్రాబాద్ నుంచి మొదలవుతుది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న పర్యాటకులు ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని.. 12791 నెంబర్ గల దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆ రోజు రాత్రి అంతా ప్రయాణం సాగుతుంది.
  2. మర్నాడు అంటే రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత వారణాసికి చేరుకుంటారు. ఆరోజు హోటల్ లో బస చేసి.. సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. రాత్రి కాశి అందాలను వీక్షిస్తూ.. అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
  3. మూడో రోజు ఉదయం కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి. అనంతరం కాలభైవర ఆలయం, భూ మందిరం సహా కాశీలోని ప్రముఖ ఆలయాలను సందర్శించవచ్చు. షాపింగ్ ఇష్టమైన వారు బెనారస్ చీరలను ఖరీదు చేయవచ్చు.  మూడో రోజు రాత్రి మళ్ళీ కాశీలోని బస చేయాల్సి ఉంటుంది.
  4. నాలుగో రోజు ఉదయం కాశి నుంచి సారనాథ్ బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ బౌద్ధ మందిరాన్ని, ధమేఖ్ స్థూపాన్ని సందర్శించాలి. అనంతరం ఇక్కడ నుంచి ప్రయాగ రాజ్ కు చేరుకోవాలి. మార్గ మధ్యలో వింధ్యాచల్ ఆలయాన్ని సందర్శించవచ్చు.   నాలుగో రోజు రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో బస చేయాల్సి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఐదో రోజు ఉదయం త్రివేణి సంగమం.. ఆనం భవన్,  ఖుస్రో భాగ్ సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి ప్రయాగలో 7.45 గంటలకు సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మర్నాడు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధర వివరాల్లోకి వెళ్తే.. 

స్టాండర్డ్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,870

డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,750

కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,880

డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,760

ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో వసతి, ఏసీ వాహనంలో సందర్శన, ​​అల్పాహారం, ప్రయాణ భీమా వర్తిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,000 కంటే తక్కువ. ప్రతి ఆదివారం జై కాశీ విశ్వనాథ్ గంగే టూర్ ని రైల్వే శాఖ అందిస్తోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..