AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soursop Fruit: ఈ పండు క్యాన్సర్‌కు దివ్యౌషధం.. ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే

ఈ పండును సంవత్సరానికి ఒకసారి తింటే ఎన్నో రోగాలను అరికడుతుంది. ఇది క్యాన్సర్ కు దివ్యౌషధమని నిపుణులు అంటున్నారు. ఈ ఆకుపచ్చ పండు ముళ్ళు కలిగి ఉంటుంది. బయటి నుండి గట్టిగా కనిపిస్తుంది. కానీ లోపల మృదువుగా, జ్యుసిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు..

Soursop Fruit: ఈ పండు క్యాన్సర్‌కు దివ్యౌషధం.. ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే
Soursop Fruit For Cancer
Srilakshmi C
|

Updated on: Mar 05, 2025 | 9:10 PM

Share

ప్రకృతితో సహజసిద్ధంగా దొరికే కొన్ని పండ్లు, ఆహారాలు మన ఆరోగ్యానికి నిజంగానే వరం లాంటివి. ముఖ్యంగా ఈ ఆకుపచ్చ ముళ్ల పండు అలాంటి అద్భుతమైన పండ్లలో ఒకటి. ఈ పండు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన ఆయుధం. దీని పేరు ‘సోర్సోప్’ లేదా ‘గ్రావియోలా’ పండు అంటారు. దీనిని లక్ష్మణ పండు, హనుమాన్ పండు అని కూడా అంటారు. ఈ ఆకుపచ్చ పండుకి చుట్టూ ముళ్ళు ఉంటాయి. బయటి నుండి గట్టిగా కనిపిస్తుంది. కానీ లోపల మృదువుగా, జ్యుసిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మధ్య, దక్షిణ అమెరికాలో సాంప్రదాయ వైద్యంలో భాగమైన ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతో ప్రసిద్ధి చెందుతోంది. క్యాన్సర్ తో పోరాడటం నుంచి గుండెపోటును నివారించడం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. లక్ష్మణ పండు రుచి స్ట్రాబెర్రీలు, అరటిపండ్ల మిశ్రమంలా ఉంటుంది. దీని గుజ్జు చాలా క్రీమీగా ఉంటుంది. పోషకాల విషయానికొస్తే కప్పు లక్ష్మణ పండులో 148 కేలరీలు, 7.42 గ్రాముల ఫైబర్, 37.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున, ఇది మధుమేహ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు నొప్పి, జ్వరం, పరాన్నజీవి ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు చికిత్స చేయడానికి లక్ష్మణ పండును ఉపయోగిస్తారు. క్యాన్సర్‌తో పోరాడడంలో లక్ష్మణ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ పండులోని లాక్టోబాసిల్లస్‌లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్నారు.

2016లో ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ప్రోస్టేట్ క్యాన్సర్‌పై లక్ష్మణ పండు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2024 సమీక్షలో లాక్టోబాసిల్లస్ పండ్లు క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు. దీనిలోని అసిటోజెనిన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌ వంటి సమ్మేళనాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. అయితే ఈ లక్ష్మణ పండు వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. 2022 అధ్యయనం ప్రకారం.. అధిక స్థాయిలో అసిటోజెనిన్‌లు తీసుకుంటే ఒంట్లో విషపూరితం కావచ్చని, ఇది పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించింది. అందుకే ఈ పండ్లను మితంగా మాత్రమే తీసుకోవాలి. అమితంగా తింటే అనర్ధాలు తప్పవన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.