AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study: రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..

ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సైతం నిద్రను మింగేస్తున్నాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు నిద్రను మింగేస్తున్నాయి. అర్థరాత్రి వరకు టీవీ షోలు, సోషల్‌ మీడియాలతో ప్రజలు గడిపేస్తున్నారు. దీంతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడినట్లే, పల్లెల్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది...

Study: రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
Sleep
Narender Vaitla
|

Updated on: Jul 08, 2024 | 12:47 PM

Share

రాత్రుళ్లు త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేవాలి. సాధారణంగా వైద్య నిపుణులు చెప్పేదే ఇది. అయితే మారిన జీవన విధానం కారణంగా ఆ జీవ గడియారం ఎప్పుడో దెబ్బతింది. ఒకప్పుడు రాత్రి 8 అయ్యిందంటే చాలు వెంటనే తినేసి పడుకునే వారు. కానీ ప్రస్తుతం పని విధానం మారింది. రాత్రి 10 అయితే కానీ డ్యూటీలు దిగని పరిస్థితి ఉంది.

ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సైతం నిద్రను మింగేస్తున్నాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు నిద్రను మింగేస్తున్నాయి. అర్థరాత్రి వరకు టీవీ షోలు, సోషల్‌ మీడియాలతో ప్రజలు గడిపేస్తున్నారు. దీంతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడినట్లే, పల్లెల్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శారీరక సమస్యలు మాత్రమే వస్తాయని మనకు తెలుసు.

అయితే నిద్ర సమస్య మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా బ్రిటన్‌లో సుమారు 73 వేల మంది వయోజలను పరిశీలించిన అనంతరం నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం త్వరగా నిద్రలేవడం, ఎన్ని గంటలు నిద్రపోతున్నారన్న వివరాలను విశ్లేషిచారు. నిద్రపోయే సమయానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ముఖ్యంగా రాత్రి అర్థరాత్రి తర్వాత నిద్రించి, ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన వారి మానసిక ఆరోగ్యంతో పోల్చితే.. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేచేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తేలింది. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రించే వారిలో నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడైంది. ఈ పరిస్థితికి ఇతర మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన వంటివాటితో కూడా సంబంధం ఉంటుంది. నిద్ర సమయాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..