India’s Great Wall: మన కళ, ధైర్యం, చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఇండియా గ్రేట్ వాల్ గురించి మీకు తెలుసా..
రాజస్థాన్ పేరు వినగానే ఎడారులు, ఒంటెలు, రంగురంగుల దుస్తులు, గంభీరమైన కోటలు గుర్తుకు వస్తాయి. ఈ భూమి దాని సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందడమే కాదు దాని వాస్తుశిల్పం కూడా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన రాజస్థాన్లోని 7 చారిత్రక కోటలు ఈ వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి. అంతేకాదు గ్రేట్ వాల్ ఆఫ్ భారత్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మైళ్ళ పొడవునా విస్తరించి ఉన్న ఒక పెద్ద గోడ..దానిపై అనేక గుర్రాలు ఒకేసారి పరుగెత్తగలవు… శతాబ్దాలుగా శత్రువుల నుంచి మొత్తం రాజ్యాన్ని రక్షించిన గోడ.. అయితే పొడవైన గోడ అంటే చైనా వాల్ గుర్తుకొస్తుంది ఎవరికైనా.. అయితే చైనా గోడకు ఏ మాత్రం తగ్గిని విధంగా మన దేశంలో కూడా పొడవైన గోడ ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు రాజస్థాన్ కి గర్వకారణంగా పిలువబడే కుంభాల్గఢ్ కోట గోడ గురించి తెలుసుకుందాం.. దీనిని చూస్తే ఆశ్చర్యపోతారు! అవును ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, ధైర్యం, కళ , చరిత్రకు సజీవ సాక్షం. ఇది ఇప్పటికీ ఆరావళి కొండలలో గర్వంగా నిలుస్తూ నాటి మేటి భారతీయుల శిల్పకళా ప్రతిభని నేటి తరానికి చాటి చెబుతోంది.
భారతదేశ ‘గ్రేట్ వాల్’ ఎక్కడ ఉందంటే ఉదయపూర్ నుంచి దాదాపు 84 కి.మీ దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఉన్న ఈ కోట దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి ఉంది. దీనిని 15వ శతాబ్దంలో మహారాణా కుంభ నిర్మించాడు. బయట దురాక్రమణదారులు ఎవరూ సులభంగా చొచ్చుకుపోలేని విధంగా ఆయన ఈ కోటను నిర్మించాడు. కుంభాల్గఢ్ భద్రతా గోడలు అంత బలంగా, వెడల్పుగా ఉండటానికి ఇదే కారణం. దీనిని ‘భారతదేశ గ్రేట్ వాల్’ అని పిలుస్తారు .
ఈ కోట గోడ దాదాపు 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ పొడవైన గోడగా నిలిచింది. ఈ గోడ ఎనిమిది గుర్రాలు కలిసి పరిగెత్తగలిగేంత వెడల్పుగా ఉంటుంది. దీని బలం, నిర్మాణాన్ని చూస్తే ఏ శత్రువు అయినా దీనిని జయించడం అంత సులభం కాదని ఊహించవచ్చు.
మేవార్ గర్వం, శౌర్యానికి చిహ్నం కుంభాల్ఘర్ను ‘మేవార్ కన్ను’ అని కూడా పిలుస్తారు. ఇది యుద్ధ సమయంలో రక్షణ ఇచ్చే కోట మాత్రమే కాదు. అనేక మంది రాజులకు ఆశ్రయంగా కూడా మారింది. బన్బీర్ మేవార్ సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. యువ ఉదయ్ సింగ్ ఈ కోటలో దాగి ఉన్నాడని చరిత్ర సాక్ష్యంగా నిలిచింది. తరువాత అదే బాలుడు ఉదయ్పూర్ను స్థాపించిన మహారాణా ఉదయ్ సింగ్ గా ఎదిగాడు.
మొఘలులతో ఎన్ని సార్లు పోరాడినా ఎప్పుడూ ఓడిపోని పరాక్రమ యోధుడు మహారాణా ప్రతాప్ జన్మించిన ప్రదేశం కుంభాల్ఘర్. అందుకే ఈ కోట నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు.. రాజస్థానీ గుర్తింపు, ధైర్యానికి చిహ్నంగా కూడా ఉంది.
కళ , విశ్వాసాల సంగమం కుంభాల్ఘర్ కేవలం సైనిక కోట మాత్రమే కాదు. ఇక్కడ 60 కి పైగా హిందూ, జైన దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. ఈ ప్రదేశం రాజకీయ, సైనిక కార్యకలాపాలకు మాత్రమే కాదు మత విశ్వాసం, సాంస్కృతిక శ్రేయస్సుకు కూడా కేంద్రంగా ఉందని ఈ ఆలయాలు చెబుతున్నారు.
కోట లోపల నిర్మించిన దేవాలయాల శిల్పాలు, వాస్తుశిల్పం ఇప్పటికీ మతం, కళ, శక్తి ఒకదానికొకటి ఎలా పూరకంగా ఉన్నాయో చూపిస్తాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే ప్రతి ఆలయం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్మించబడింది. ఒక చోట ధ్యానం కోసం.. మరొక చోట ధైర్యం, ఆరాధన కోసం.
కోటలోని వివిధ భాగాలకు వేర్వేరు పేర్లు ఉన్నాయి. ‘తుత్యా కా హోడా’ ఒక నడక మార్గం. దానివా ఇది కోట తూర్పు వైపుకు దారితీస్తుంది. ‘హిరాబరి’ అనేది పశ్చిమం వైపు మరొక మార్గం, అక్కడి నుంచి ‘కున్వర్ పృథ్వీరాజ్ కి ఛత్రి’ కొద్ది దూరంలో ఉంది. యుద్ధంలో అమరుడైన పృథ్వీరాజ్.. అతని గుర్రం సహాన్ సమీపంలో కనిపిస్తాయి
కుంభాల్గఢ్ కోట నేటికీ గర్వంగా నిలుస్తుంది. ఈ కుంభాల్గఢ్ కోటలోకి ప్రవేశించినప్పుడు, ప్రతి రాయి, ప్రతి గోడ, ప్రతి ద్వారం చరిత్ర పుటలలోతుల్లోంచి ఏదో చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కోట కేవలం ఒక భవనం మాత్రమే కాదు, సంస్కృతి, ధైర్యం, సాహసానికి సజీవ ఉదాహరణ. అందుకే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. తద్వారా భారతదేశానికి కూడా కేవలం రాళ్లతో కాదు గర్వం, చరిత్ర కలిగిన గోడ ఉందని భవిష్యత్ తరాలు తెలుసుకోగలవు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








