Dark Marks: ముఖంపై నల్లటి మచ్చాలతో ఇబ్బందా.? ఇలా చేయండి మూడు వారాల్లో పక్కా రిజల్ట్..
మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో..
మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో దొరికే ప్రతీ క్రీమ్ను వాడేస్తుంటారు. దీంతో మచ్చలు తగ్గడం అటుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లటి మచ్చలకు చెక్ పెట్టొచ్చు. గుమ్మడి గింజల ద్వారా మచ్చలను దూరం చేసుకునే టెక్నిక్ ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలంటే..
గుమ్మడి గింజలతో ఫేస్ప్యాక్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గుమ్మడికాయ గింజలు, తేనె, యాపిల్ వెనిగర్ కావల్సి వస్తాయి. ముందుగా గుమ్మడికాయ గింజల్ని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్లా తయరా చేసుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. వీటన్నింటినీ కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే గుమ్మడికాయ గింజల ఫేస్ప్యాక్ రెడీ. మధ్యలో అవసరానికి అనుగుణంగా కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. లేదంటే తేనె కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు.
ఇక ఈ పేస్ట్ను మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకునే ముందే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మచ్చలు ఉన్న చోటుతో పాటు ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు ఫేస్ప్యాక్ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. మచ్చలు తగ్గడంతో పాటు కోల్పోయిన నిగారింపును తిరిగి పొందొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..