AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తిపండ్లు లేదా ఖర్జూరం, ఏది పాలలో కలిపి తాగడం మంచిది? నిపుణుల సలహా ఏమిటంటే

చలికాలం రాగానే ప్రజలు డ్రై ఫ్రూట్స్‌తో పాలు తాగడం ప్రారంభిస్తారు. దీని కారణంగా శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. శక్తివంతంగా ఉంటుంది. కొంతమందికి అత్తి పళ్లు పాలు తాగడం ఇష్టం అయితే మరికొందరికి ఖర్జూరంతో పాలు తాగడం ఇష్టం? అయితే ఈ రెండింటిలో ఏది హెల్తీ ఆప్షన్ అనేది నిపుణుల నుండి తెలుసుకుందాం...

అత్తిపండ్లు లేదా ఖర్జూరం, ఏది పాలలో కలిపి తాగడం మంచిది? నిపుణుల సలహా ఏమిటంటే
Dates Milk Benefits
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 8:16 AM

Share

వర్షాకాలం ముగిసి శీతాకాలంలో అడుగు పెడుతున్నాం.. ఈ సీజన్‌లో ప్రజలు తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చలికాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచేలా పని చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. శరీరానికి సరిపడా పోషకాహారాన్ని అందించడంతో పాటు, శక్తిని కూడా నింపుతాయి. డ్రై ఫ్రూట్స్‌ను పాలతో కలిపి తినడానికి కొంతమంది ఇష్టపడతారని ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ ఆసుపత్రి చీఫ్ డైటీషియన్ పాయల్ శర్మ చెప్పారు. చాలా మంది అంజీర పండ్లను, ఖర్జూరాలను పాలలో వేసి మరిగించి తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో అత్యంత శక్తివంతమైన కలయిక ఏది అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. నిపుణుల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

రెండు ఆరోగ్యకరమైన ఎంపికలు

అత్తిపండ్లు, ఖర్జూరం రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లని డైటీషియన్ పాయల్ శర్మ చెబుతున్నారు. వీటిని పాలలో కలుపుకుని తింటే.. వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. మరోవైపు, ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది.. ఇది తాజాదనం, శక్తికి మూలం.

ఇవి కూడా చదవండి

ఎముకలు-చర్మం కోసం

అత్తి పండ్లను లేదా ఖర్జూరాలను పాలలో కలిపి తాగితే అది పోషక పానీయంగా మారుతుంది. ఇది ఎముకలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియం.. అత్తి పండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మెరుపును ఇస్తుంది.

అలసట దూరమవుతుంది

అంజీర్ లేదా ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే అంజీర్ లేదా ఖర్జూర కలిపిన పాలు తాగవచ్చు. ఇలా చేస్తే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అత్తి పండ్లను, ఖర్జూరంతో పాలు తాగడం చాలా ఆరోగ్యకరమైనది. వీటిని కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..