Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగిలిన మడమల సమస్యలతో బాధపడుతున్నారా..? నిద్రపోయే ముందు ఈ హోం రెమెడీని ట్రై చేసి విముక్తి పొందండి..!!

తేనె, పచ్చి పాలు పగిలిన మడమల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెను పాదాలకు అప్లై చేయడం వల్ల చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంపై రంధ్రాలను క్లియర్ చేయడంలో తేనె సహాయపడుతుంది. ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె చాలా సహాయకారిగా నిరూపిస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. పగిలిన మడమల కోసం తేనె ఔషధంలా పనిచేస్తుంది. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

పగిలిన మడమల సమస్యలతో బాధపడుతున్నారా..? నిద్రపోయే ముందు ఈ హోం రెమెడీని ట్రై చేసి విముక్తి పొందండి..!!
Winter And Cracked Heels
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2023 | 8:49 AM

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దానికి తగు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఇంటి నివారణలు, మార్కెట్లో లభించే పలు రకాల ఉత్పత్తులను కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ముఖ చర్మంపై మాత్రమే కాకుండా, పాదాల మడమల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పెరిగిన పొడి వాతావరణం కారణంగా, పాదాల మడమలు పగుళ్లు ప్రారంభమవుతాయి. ఇది శీతాకాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం, మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. మీ పాదాల మడమలను పగుళ్లు రాకుండా చేయడం ద్వారా వాటిని మృదువుగా చేయవచ్చు. కాబట్టి పాదాలను సరైన మార్గంలో ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.

పగిలిన మడమల నివారణ కోసం కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలంటే..

– తేనె, పచ్చి పాలు పగిలిన మడమల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెను పాదాలకు అప్లై చేయడం వల్ల చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంపై రంధ్రాలను క్లియర్ చేయడంలో తేనె సహాయపడుతుంది. ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె చాలా సహాయకారిగా నిరూపిస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. పగిలిన మడమల కోసం తేనె ఔషధంలా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, మీ పాదాల మడమల మీద పచ్చి పాలను రాస్తే ఏమవుతుందో తెలుసా..?

పచ్చిపాలు మీ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి పని చేస్తాయి. ఇక పచ్చిపాలు, తేనెతో వింటర్ సీజన్‌లో పగిలిన మడమలకు ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

ముందుగా ఒక గిన్నెలో 3 నుండి 4 స్పూన్ల తేనె వేయండి. అందులో 2 నుండి 3 చెంచాల పచ్చి పాలు కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి పాదాల మడమల మీద అప్లై చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు పాదాల మడమల మీద అలాగే ఆరనివ్వాలి. మీకు కావాలంటే, మీరు తేలికపాటి చేతి ఒత్తిడితో మీ పాదాలకు మసాజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాదాల మడమల మీద తేనె, పాలను స్మూత్‌గా మర్ధనా చేస్తూ శుభ్రం చేయండి. మీరు దీన్ని వారానికి కనీసం 3 నుండి 4 సార్లు ఉపయోగించి చూడండి. రాత్రిపూట ఈ హోం రెమెడీని ప్రయత్నించండి. ఈ హోం రెమెడీ ప్రభావాన్ని మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు, మీరు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఒకసారి ప్యాచ్ టెస్ట్ కూడా చేయండి. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..