AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Food: విటమిన్ D ఎక్కువగా ఉండే పదార్థాలు కరోనాను తగ్గిస్తాయా ? అధ్యాయానాలు ఏం చెబుతున్నాయంటే..

కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. అయితే మరోవైపు కోవిడ్.. మానవుల జీవన శైలిని మార్చేసింది అనడంలో

Immunity Food: విటమిన్ D ఎక్కువగా ఉండే పదార్థాలు కరోనాను తగ్గిస్తాయా ? అధ్యాయానాలు ఏం చెబుతున్నాయంటే..
Vitamin D Rich Food
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2021 | 4:34 PM

Share

కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. అయితే మరోవైపు కోవిడ్.. మానవుల జీవన శైలిని మార్చేసింది అనడంలో సందేహం లేదు. జంక్ ఫుడ్… ఆయిల్ ఫుడ్ తినడం మానేసి.. ఇప్పుడు అందరూ.. రోగ నిరోధక శక్తిని పెంచే సహజ కూరగాయలు పండ్లు ఎక్కువగా తింటున్నారు. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాదాన్యత ఇస్తున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం కోవిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి కొవ్వులో కరిగే పోషకం. ఇది శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే కరోనాను కట్టడికి ఇప్పుడు దేశం మొత్తం టీకా పంపిణీ చేస్తున్న క్రమంలో.. కోవిడ్ కి కారణమయ్యే.. Sars-CoV-2 అనే వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు ఈ విటమిన్ డి సహయపడుతుందని.. ఇటీవల పలు అధ్యాయనాల్లో బయటపడింది. అంతేకాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా నివారించడంలో ఈ విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది.

చికాగో మెడిసిన్ విశ్వ విధ్యాయంలో డాక్టర్ డేవిడ్ మెల్టర్జ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం ఉన్నవారికి… విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారితో పోలిస్తే.. కరోనా సోకే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 489 మంది రోగులలో కోవిడ్ కు పాజిటివ్ పరీక్షించే ప్రమాదం విటమిన్ డి లోపం ఉన్నవారికి 1.77 రెట్లు ఎక్కువ అని తేలింది. మెల్టర్జ్ మాట్లాడుతూ.. ఆహారంలో తగినంత విటమిన్ డి ఉండడంవలన కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. మాస్కులు ధరించడం.. ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించడం తర్వాత.. అవసరమైన సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

దాదాపు పరిశోధన అధ్యయనాల ప్రకారం.. రోజూ విటమిన్ డి పదార్థాలను తీసుకోవడం వలన కరోనా వలన ఏర్పడే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తుంది. అయితే ఇతర అధ్యయనాలు.. కాల్విఫెడియోల్ ప్రకారం విటమిన్ డి ఎక్కువగా ఉండే కరోనా రోగులకు ఐసీయూ వరకు వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. అంతేకాకుండా.. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. సాల్మన్, ఇతర కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పుట్టగొడగులు, పాలు వంటి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఎక్కువగా సూర్య రశ్మి తగడం కూడా మంచిదే.

Also Read: 8 Banks Account Holders : ఈ 8 బ్యాంకుల ఖాతాదారులు జూలై 1 ముందే ఈ పనులు చేసుకోవాలి..! లేదంటే అకౌంట్‌లో డబ్బు జమకాదు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?