AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: పెరుగు తిని వెంటనే ఈ 6 ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. ప్రమాదంలో పడినట్లే!

పెరుగు లేకుండా మధ్యాహ్నం లంచ్ ఎవ్వరికీ పూర్తి కాదు. పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి...

Curd: పెరుగు తిని వెంటనే ఈ 6 ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. ప్రమాదంలో పడినట్లే!
Curd
Ravi Kiran
|

Updated on: Jun 06, 2022 | 1:33 PM

Share

పెరుగు లేకుండా మధ్యాహ్నం లంచ్ ఎవ్వరికీ పూర్తి కాదు. పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో ఉండే కాల్షియం.. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇదిలా ఉంటే చాలామందికి ఉదయాన్నే పెరుగు, పంచదార కలిపి తినడం అలవాటు.. ఇది శారీరికంగా, మానసికంగా ఎంతగానో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని పదార్ధాలను మాత్రం పెరుగుతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఆ పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. పెరుగు, చేప – పెరుగు, చేపలు కలిపి అస్సలు తినకూడదు. దీనికి కారణం లేకపోలేదు. రెండింటిలోనూ అధిక ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే వాటిని కలిపి తింటే అజీర్ణంతో పాటు చర్మ సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

2. పెరుగు, పాలు – పెరుగుతో పాటు పాలు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

3. పెరుగు, ఉల్లిపాయ – చాలామందికి పెరుగన్నంలో ఉల్లిపాయ కలుపుకుని తినడం అలవాటు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. పెరుగేమో శరీరాన్ని చల్లపరుస్తుంది.. ఉల్లిపాయ వేడిని పెంచుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. దద్దుర్లు, సోరియాసిస్, గ్యాస్ సమస్య, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు

4. పెరుగు, మామిడికాయ: పెరుగు తిన్న వెంటనే.. లేదా పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు. ఎలర్జీలు, చర్మ సమస్యలు తలెత్తవచ్చు.

5. పెరుగు, నూనె పదార్ధాలు – పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన ఆహార పదార్ధాలను అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే.. అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు.

6. పెరుగు, మినపప్పు – పెరుగు తిని వెంటనే మినపప్పుతో చేసే వంటకాలు తినకండి. దీని వల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్