భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
Drinking Water Between Meal
Follow us

|

Updated on: Jul 26, 2024 | 12:31 PM

మనలో చాలా మందికి భోజనం మధ్య నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే, మీ ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా..? భోజనం చేసేటప్పుడు నీరు, ముఖ్యంగా చల్లటి నీరు తాగడం అవసరమని కొందరు భావిస్తారు. భోజనం చేసే సమయంలో ఎక్కువ నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఇలా చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మనం భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం కాదు. సాధారణంగా మనం తింటున్న ఆహారంతో మన శరీరంలో జీర్ణ క్రియ జరగడం కోసం కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అయితే, మనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఆ రసాయనాల ఘాడత తగ్గి మన ఆహారం సరిగా జీర్ణం కాకుండా చేస్తుంది.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు దెబ్బతింటాయి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియకు లాలాజలం చాలా ముఖ్యం. అయితే, భోజన సమయంలో నీళ్లు తాగడం వల్ల మీ లాలాజలం పలుచన అవుతుంది. సాధారణంగా భోజనంతో పాటు నీళ్లు తాగే వారికి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుంది. భోజనం మధ్య నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.

ఇవి కూడా చదవండి

భోజనం మధ్య నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాగే, భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగితే బరువు త్వరగా పెరుగుతారని, దీంతో ఊబకాయం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన