AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vrindavan: బృందావన సందర్శనానికి వెళ్తున్నారా.. ఎక్కడ చౌకగా.. ఎక్కడ ఉచితంగా ఆహారం లభిస్తుందో తెలుసా..

బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం, మధురలోని శ్రీ కృష్ణ జన్మ భూమి హిందువులకు విశ్వాస కేంద్రాలు. దీంతో పాటు బృందావనంలో నిర్మించిన గోవర్ధన్ పరిక్రమ, ప్రేమ మందిరం తదితరాలు ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే నిజమైన బృందావనం వీధుల్లో నివసిస్తుంది. ఇక్కడికి వచ్చి పురాతన దేవాలయాలను సందర్శించడం మొదలుపెడితే కనీసం మూడు నాలుగు రోజులు తిరగాల్సిందే. మీరు కూడా బృందావనాన్ని సందర్శించాలనుకుంటే తక్కువ డబ్బుతో చుట్టేయ్యవచ్చు. అంతేకాదు రుచికరమైన ఆహరాన్ని ఉచితంగా తినవచ్చు.

Vrindavan: బృందావన సందర్శనానికి వెళ్తున్నారా.. ఎక్కడ చౌకగా.. ఎక్కడ ఉచితంగా ఆహారం లభిస్తుందో తెలుసా..
Tasty Food In VrindavanImage Credit source: PhotosIndia.com/photosindia-Alf/Moment/Getty Images
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2024 | 5:08 PM

మనదేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విహరించాలని.. తమకు ఇష్టమైన దేవుళ్ళను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కన్నయ్య భక్తులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని జన్మ భూమి మధుర, నడయాడిన భూమి అయిన బృందావనానికి వెళ్లాలని కోరుకుంటారు. బాంకే బిహారీ దేవాలయంతో పాటు ఇతర ప్రదేశాలను సందర్శించడానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. చాలా మంది వ్యక్తులు కేవలం ఒక రోజు పర్యటనను ప్లాన్ చేసుకుని కన్నయ్యన్ని దర్శించుకుని తర్వాత తిరిగి వస్తారు. వాస్తవానికి తమ దగ్గర తగినంత బడ్జెట్ లేదు.. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం కాదు. బడ్జెట్ కారణంగా అక్కడ ఉండడం, తినడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అయితే బృందావన్‌లో కేవలం 20 రూపాయలకే స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారాన్ని పొందగల స్థలం ఉందని మీకు తెలుసా. అంతేకాదు కొన్ని ప్రదేశాలలో ఉచిత ఆహారం కూడా అందుబాటులో ఉంది.. ఈ రోజు ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం, మధురలోని శ్రీ కృష్ణ జన్మ భూమి హిందువులకు విశ్వాస కేంద్రాలు. దీంతో పాటు బృందావనంలో నిర్మించిన గోవర్ధన్ పరిక్రమ, ప్రేమ మందిరం తదితరాలు ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే నిజమైన బృందావనం వీధుల్లో నివసిస్తుంది. ఇక్కడికి వచ్చి పురాతన దేవాలయాలను సందర్శించడం మొదలుపెడితే కనీసం మూడు నాలుగు రోజులు తిరగాల్సిందే. మీరు కూడా బృందావనాన్ని సందర్శించాలనుకుంటే తక్కువ డబ్బుతో చుట్టేయ్యవచ్చు. అంతేకాదు రుచికరమైన ఆహరాన్ని ఉచితంగా తినవచ్చు.

బృందావనం రుచి గుర్తుండిపోతుంది

బృందావనం, మధురలు భక్తులకు విశ్వాస కేంద్రమే కాదు.. సందర్శించడానికి.. ఆహారం తినడానికి గొప్ప ప్రదేశం. ఇక్కడ ఖచ్చితంగా మార్కెట్‌లో సరసమైన ధరలకు ఆహారం పొందుతారు. అంతేకాదు చాలా ప్రదేశాల్లో భక్తులకు చాలా తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా కూడా మంచి ఆహారం అందించబడుతుంది.

ఇవి కూడా చదవండి

బృందావనంలో కేవలం 20 రూపాయలకే ఆహారం

బృందావనంలో శ్రీ జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో కేవలం 20 రూపాయలకే మంచి, రుచికరమైన ఆహారం అందిస్తారు. ఇక్కడికి వెళ్లిన తర్వాత ముందుగా టోకెన్ తీసుకోవాలి. అది ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫుడ్ ప్లేట్ తీసుకోవచ్చు. ఇందులో రోటీ, అన్నంతో పాటు రకరకాల కూరలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ఏకైక నియమం ఏమిటంటే.. ఆహారం తిన్న తర్వాత మీ ప్లేట్ ను మీరే శుభ్రం చేసుకోవాలి. శ్రీ జగన్నాథ వంట గది పరిక్రమ మార్గ్‌లోని సుదామ కుటీర సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఎక్కడ ఉచిత ఆహారం పొందుతారంటే

బృందావనంలోని చనా పువా ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జీ రసోయిలో ఆహారం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు రోజంతా ఆహారం పొందుతారు. ఈ ప్రదేశం బాంకే బిహారీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. అంతేకాదు బృందావన పరిక్రమ మార్క్‌లో ఉన్న గౌరీ గోపాల ఆశ్రమంలో ఉచిత ఆహారం అందిస్తారు. ఈ స్థలం కూడా రోజంతా తెరిచి ఉంటుంది. కనుక ఎప్పుడైనా వెళ్లి ఆహారం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులందరికీ ఆహారం అందిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..