AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg Water: రాత్రి నిద్ర చక్కగా పట్టాలంటే.. ఈ నీళ్లు తాగాల్సిందే!

జాజికాయ.. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పొచ్చు. జాజికాయ నుంచి మంచి సువాసన వస్తుంది. జాజికాయను ఎక్కువగా బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బిర్యానీలో ఉపయోగించడం వల్ల చక్కటి రుచి కూడా వస్తుంది. ఇది మిరి స్టికా జాతికి చెందిన చెట్టు విత్తనం నుంచి జాజికాయ వచ్చింది. జాజికాయను కేవలం బిర్యానీలోనే కాకుండా సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించడంలో కూడా ఉపయోగ పడుతుంది. ఆయుర్వేదంలో పలు దీర్ఘకాలిక సమస్యలు తగ్గించడంలో..

Nutmeg Water: రాత్రి నిద్ర చక్కగా పట్టాలంటే.. ఈ నీళ్లు తాగాల్సిందే!
Nutmeg
Chinni Enni
|

Updated on: Sep 04, 2024 | 6:12 PM

Share

జాజికాయ.. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పొచ్చు. జాజికాయ నుంచి మంచి సువాసన వస్తుంది. జాజికాయను ఎక్కువగా బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బిర్యానీలో ఉపయోగించడం వల్ల చక్కటి రుచి కూడా వస్తుంది. ఇది మిరి స్టికా జాతికి చెందిన చెట్టు విత్తనం నుంచి జాజికాయ వచ్చింది. జాజికాయను కేవలం బిర్యానీలోనే కాకుండా సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించడంలో కూడా ఉపయోగ పడుతుంది. ఆయుర్వేదంలో పలు దీర్ఘకాలిక సమస్యలు తగ్గించడంలో యూజ్ చేస్తారు. ఇందులో కొన్ని అనేక ఔషధ గుణాలు మనకు లభిస్తాయి. జాజికాయ పొడి మనకు బయట మార్కెట్లో కూడా లభిస్తుంది. ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న జాజికాయ నీటిని రాత్రి పడుకునే ముందు కలిపి తాగడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర చక్కగా పడుతుంది:

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీటిని తాగడం వల్ల.. చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఈ నీటిని తాగడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర లేమి సమస్య నుంచి ఇది బయట పడేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మెలటోనిన్ అనే ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల నిద్ర కలుగుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన అనేవి బాగా ఎక్కువై పోయాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో జాజికాయ నీళ్లు ఎంతో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నొప్పులు తగ్గుతాయి:

ప్రస్తుత కాలంలో కూర్చొని పని చేసే ఉద్యోగాలు ఎక్కువ. ఇలా ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల తల, మెడ, వెన్ను వంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఎక్కువగా జాజికాయ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నీటిని తాగితే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. ఇది బలంగా ఉంటేనే రోగాలు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగు పడుతుంది. అదే విధంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు పెరగకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే