AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజు గుప్పెడు వేరుశనగలు తింటే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

ప‌ల్లీల లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను క‌లిగిఉండ‌టంతో మ‌ధుమేహ రోగులూ నిర‌భ్యంత‌రంగా వీటిని తీసుకోవ‌చ్చు. ప‌ల్లీల్లో ఫైబ‌ర్ అధికంగా ఉండ‌టంతో మ‌ల‌బద్ధ‌కాన్ని నివారించ‌డ‌మే కాకుండా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. తీవ్ర వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. ఇక బెల్లంతో చేసే ఈ పల్లీ పట్టిలో ఐరన్​, ఫైబర్​, విటమిన్లు, మినరల్స్​తో పాటు ఆరోగ్యకర కొవ్వులు, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 

రోజు గుప్పెడు వేరుశనగలు తింటే..  శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీకు డయాబెటిస్ ఉంటే వేరుశనగలను భయం లేకుండా తినొచ్చు. వేరుశెనగలో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగలో విటమిన్ ఇ ఉండటం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.
Jyothi Gadda
|

Updated on: Dec 30, 2024 | 9:35 PM

Share

పల్లీలు సహజ సిద్ధంగా ఉండే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ B, విటమిన్ E వంటివి హెల్తీగా ఉంచుతాయంటున్న పోషకాహర నిపుణులు. వేరుశనగలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక గుడ్డులో ఉండే ప్రోటీన్ అందులో ఉంటాయి. ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి.  పల్లీలు తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ బీ కాంప్లెక్స్, నియాచిన్, రిబోఫ్లోవిన్, థియామిన్, విటమిన్ బీ6, పెంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి. ముఖ్యంగా చలికాలం వేరుశనగలు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి.

రోజూ గుప్పెడు వేరుశనగలు తినటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాదాంలో ఉండే పోషకాలు ఇందులో ఉంటాయి. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. పల్లీల్లో మోనో ఇన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌‌ను నాశనం చేస్తుంది. వేరుశనగల్లో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప‌ల్లీల్లో ఫైబ‌ర్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఉప‌క‌రిస్తుంది. రోజూ 30 నుంచి 40 గ్రాముల ప‌ల్లీలు తింటే సరిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా తోడ్పడుతుంది. ఆక‌లిని పోగొట్టి ఎక్కువ‌సేపు క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.

వేరుశనగలో ఉండే ఆరోగ్య‌క‌ర కొవ్వుల‌తో పాటు మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాప‌ర్, ఇత‌ర పోష‌కాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప‌ల్లీల లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను క‌లిగిఉండ‌టంతో మ‌ధుమేహ రోగులూ నిర‌భ్యంత‌రంగా వీటిని తీసుకోవ‌చ్చు. ప‌ల్లీల్లో ఫైబ‌ర్ అధికంగా ఉండ‌టంతో మ‌ల‌బద్ధ‌కాన్ని నివారించ‌డ‌మే కాకుండా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. తీవ్ర వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. ఇక బెల్లంతో చేసే ఈ పల్లీ పట్టిలో ఐరన్​, ఫైబర్​, విటమిన్లు, మినరల్స్​తో పాటు ఆరోగ్యకర కొవ్వులు, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..