గోల్డ్ కాయిన్, కొత్త బట్టలు, స్వీట్స్‌తో సిబ్బందికి సర్​ప్రైజ్​

తమిళ హీరో శింబు కోలివుడ్‌లోని పాత సాంప్రదాయాన్ని పాలో అయ్యారు. తన కొత్త సినిమా 'ఈశ్వరన్' సిబ్బందికి దీపావళి గిఫ్ట్ కింద ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలను బహుమతిగా అందించి...  పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చాడు.

గోల్డ్ కాయిన్, కొత్త బట్టలు, స్వీట్స్‌తో సిబ్బందికి సర్​ప్రైజ్​
Follow us

|

Updated on: Nov 08, 2020 | 3:41 PM

తమిళ హీరో శింబు కోలివుడ్‌లోని పాత సాంప్రదాయాన్ని పాలో అయ్యారు. తన కొత్త సినిమా ‘ఈశ్వరన్’ సిబ్బందికి దీపావళి గిఫ్ట్ కింద ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలు, స్వీట్స్‌ను బహుమతిగా అందించి…  పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చాడు. అయితే.. తమిళ ఇండస్ట్రీలో ఈ సంప్రదాయం.. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్​తో ప్రారంభమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్​ వంటి హీరోలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా శింబు.. ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈశ్వరన్​ చిత్రంలో నటించిన 200 మంది జూనియర్​ ఆర్టిస్ట్​లకు కూడా శింబు కొత్త బట్టలు అందజేసి, వారి మనసులు గెలుచుకున్నాడు. చిత్రీకరణ​ చివరి రోజు ఈ కానుకలను వారికి పంపిణీ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈశ్వరన్ చిత్రాన్ని​ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈశ్వరుడు పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా శింబు పెళ్లి వార్తలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కథానాయిక త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తను హీరో, హీరోయిన్లు సహా ఖండించకపోడంతో త్వరలోనే శింబు, త్రిషతో దాంపత్య జీవింతంలోకి అడుగుపెడుతున్నాడని అందరూ భావిస్తున్నారు.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్