దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇప్పుడు ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా కావడం లేదు. ప్రస్తుత అంతా సోషల్ మీడియా జనరేషన్ నడుస్తూ ఉండటంతో, ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది.

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: Nov 08, 2020 | 2:39 PM

ఇప్పుడు ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా కావడం లేదు. ప్రస్తుత అంతా సోషల్ మీడియా జనరేషన్ నడుస్తూ ఉండటంతో, ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. కళ్లు తెరిచిన దగ్గర నుంచి మూసే వరకు ఫోన్ మన లైఫ్‌లో భాగం అయ్యింది. అయితే చాలామంది పడుకునేముందు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కనే పెట్టుకుంటారు. మరికొంతమంది దిండు కింద పెట్టుకుని నిద్రిస్తారు. ఇలా చేసేవారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తాజాగా దిండు కింద పెట్టిన ఓ ఫోన్ పేలిన ఘటన కేరళలో జరిగింది.  కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి తన నోకియా ఫీచర్‌ ఫోన్‌ను నైట్ పడుకునే ముందు దిండు కింద పెట్టి నిద్రించాడు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌ పేలడంతో అతడి భుజం, ఎడమ మోచేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. పడుకునేముందు చొక్కా ధరించకపోవడంతో గాయాల తీవ్రత పెరిగింది. .

బాధితుడు వివరాల ప్రకారం.. ‘నేను త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  నుంచి ప్రయాణికుడిని తన గమ్యస్థానం వద్ద వదిలిపెట్టి ఇంటికి వచ్చా. అప్పటికే బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోయా. అయితే ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో మేల్కొన్నా. భుజం వద్ద నొప్పిగా అనిపించింది. దిండు కాలిపోతూ ఉండగా ఫోన్‌ నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే ఫోన్‌ను దూరంగా నెట్టేసి హాస్పిటల్‌కు వెళ్లాను’ అని తెలిపాడు. దిండు కింద పెట్టినప్పుడు ఛార్జింగ్‌ పెట్టలేదని, అయినప్పటికీ బ్యాటరీ ఉబ్బిపోయి పేలుడు సంభవించిదని బాధితుడు పేర్కొన్నాడు. పేలడానికి గల రీజన్ ఏంటో తనకు తెలియదని, నోకియా కంపెనీ సమస్యను గుర్తించి పరిష్కరించాలని బాధితుడు కోరాడు.

Also Read : వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్