AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP RS Candidates: రాజ్యసభ బెర్తులు ఖరారు.. మరి నాలుగోది?

మార్చినెలలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు జగన్ ఖరారు చేశారు. అయితే, నాలుగో వ్యక్తిని ఎంపిక చేయకపోవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

YCP RS Candidates: రాజ్యసభ బెర్తులు ఖరారు.. మరి నాలుగోది?
Rajesh Sharma
|

Updated on: Feb 17, 2020 | 3:25 PM

Share

Jagan finalised YCP Rajyasabha candidates: మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పెద్దల సభకు పంపే నేతల పేర్లను వైసీపీ అధినేత జగన్ ఇదివరకే ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్‌కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. అయితే.. మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా.. కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయడం వెనుక వ్యూయహమేంటన్న చర్చ కూడా జోరందుకుంది.

ప్రస్తుతం జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఈసారి మార్చిలో ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో నాలిగింటికి నాలుగు మొత్తం వైసీపీకే దక్కే ఛాన్స్ వుంది. కానీ.. వైసీపీ తాజాగా ముగ్గురు పేర్లను మాత్రమే ఖరారు చేయడంతో నాలుగో సీటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాన్ని ఎవరికి కేటాయిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.

తాజాగా బీజేపీకి వైసీపీ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నందున బీజేపీ కోరిన వ్యక్తిని నాలుగో ఎంపీగా రాజ్యసభకు పంపుతారని చర్చ జరుగుతోంది. అదే సమయంలో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీకి ఇస్తారా లేక నాలుగో సీటును వైసీపీ కోటాలోనే చిరంజీవిని పంపుతారా అన్నది వేచి చూడాల్సిన అసవరం వుంది.

కాగా.. ఇప్పుడుకి ఖరారైన పేర్లను పరిశీలిస్తే వారిలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వ్యవస్థాపకులు. క్రియాశీ రాజకీయాలకు వచ్చే వరకు ఆయన రాంకీ చైర్మెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం స్మిలాక్స్, ట్రాడాక్స్, ఆర్.వాక్ సంస్థల్లో బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అయోధ్యరామిరెడ్డి.. గతంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా వున్న అయోధ్య రామిరెడ్డిని త్వరలో రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న అయోధ్యరామిరెడ్డి తనయుని వివాహానికి జగన్ స్వయంగా హాజరు కావడంతో ఆయనకిస్తున్న ప్రాధాన్యతను చాటుతోందని చెప్పుకుంటున్నారు.

Also read: Pawan Kalyan to share dias with Amith Shah soon

ఇక ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత బీదా మస్తాన్ రావును రెండో అభ్యర్థిగా జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి ఆయన వైసీపీలో చేరారు. పార్టీకి కొత్తే అయినా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బీదా అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. బీదా, విజయసాయి తొలి నాళ్ళలో కొలీగ్స్ కావడమే వారిద్దరి సాన్నిహిత్యానికి కారణమని చెప్పుకుంటున్నారు. బీసీ వర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు అభ్యర్థిత్వం ఆల్‌రెడీ కన్‌ఫర్మ్ అయిందని తెలుస్తోంది.

జగన్‌కు అత్యంత సిన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణకు మూడో టిక్కెట్ లభిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈయన మత్స్యకార కుటుంబానికి చెందిన వారు. గతంలో జగన్‌తో పాటు అవినీతి ఆరోపణలతో వాన్‌పిక్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. జగన్ లాయలిస్టుల జాబితాలో తొలి నాలుగైదు పేర్లలో మోపిదేవి పేరు చెప్పుకుంటుంటారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోపిదేవిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే.. తాజాగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మోపిదేవిని రాజ్యసభకు తప్పక పంపాల్సి అవసరం కనిపిస్తోంది. ఆమేరకు మోపిదేవి వెంకటరమణ పేరును రాజ్యసభకు మూడో అభ్యర్థిగా ఖరారు చేశారని అంటున్నారు.

ఇక మిగిలిన నాలుగో సీటు విషయంలోనే పెద్ద చర్చ జరుగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Follow Us