AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Story: ట్విట్టర్ మొండి పట్టుదలకు కారణం ఏమిటి? ఎందుకు భారత ప్రభుత్వం మాట లెక్కచేయడం లేదు?

Twitter Story:  ట్విట్టర్ భారతదేశంలో దాని చట్టపరమైన రక్షణను తొలగించింది. ఇప్పుడు దీనిపై ఐపిసి కేసులు నమోదు చేసుకోవచ్చు. పోలీసులు కూడా ఆరా తీయవచ్చు. ఐటి నిబంధనలను పాటించనందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Twitter Story: ట్విట్టర్ మొండి పట్టుదలకు కారణం ఏమిటి? ఎందుకు భారత ప్రభుత్వం మాట లెక్కచేయడం లేదు?
Twitter Story
KVD Varma
|

Updated on: Jun 17, 2021 | 12:59 PM

Share

Twitter Story:  ట్విట్టర్ భారతదేశంలో దాని చట్టపరమైన రక్షణను తొలగించింది. ఇప్పుడు దీనిపై ఐపిసి కేసులు నమోదు చేసుకోవచ్చు. పోలీసులు కూడా ఆరా తీయవచ్చు. ఐటి నిబంధనలను పాటించనందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫిబ్రవరి 2021 నుండి ట్విట్టర్, ప్రభుత్వం మధ్య గొడవ ముదిరింది. ఫిబ్రవరిలో ప్రభుత్వం 1178 పేర్ల జాబితాను ట్విట్టర్‌కు అందచేసింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ శాంతిభద్రతలకు సమస్యలను కలిగిస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే ఆపాలని ప్రభుత్వం తెలిపింది. ఆర్డర్ పాటించకపోతే, ఐటి యాక్ట్ 69 ఎ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రభుత్వ ఈ ఉత్తర్వు ట్విట్టర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. మీడియా గ్రూపులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, నాయకుల ఖాతాలపై తాము చర్యలు తీసుకోబోవడం లేదని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ”మేము మా వినియోగదారుల మాట్లాడే స్వేచ్ఛ కోసం నిలబడతాము.” అని ట్విట్టర్ ప్రకటించింది. దీని తరువాత, ప్రభుత్వం-ట్విట్టర్ మధ్య ప్రారంభమైన ఉద్రిక్తత మరింత పెరిగింది. ట్విట్టర్ గానీ, ప్రభుత్వం గానీ రెండూ ఎక్కడా తగ్గడం లేదు. భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే ఒక సంస్థ భారత ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది? మరోవైపు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించాయి. భారత ప్రభుత్వం చేసిన కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయి. కానీ, ట్విట్టర్ మాత్రం ఎందుకు ససేమిరా అంటోంది? భారత ప్రభుత్వంతో ఆమీ తూమీ కి రెడీ అన్నవిధంగా ఎందుకు ప్రవర్తిస్తోంది?

ఈ ప్రశ్నకు ముఖ్యమైన సమాధానం ఒక్కటే కనిపిస్తోంది.. ట్విట్టర్ ఆదాయంలో 55 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. అంతే కాకుండా ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఒక్క భారతదేశంలోనే దాని వ్యాపారం జరగడం లేదు. మిగిలిన సోషల్ మీడియా యాప్ లకు భారతదేశం నుంచి వచ్చే వ్యాపార ప్రయోజనాలే ఎక్కువ. కానీ, ట్విట్టర్ కు భారతదేశం వెలుపల పెద్ద మార్కెట్ ఉంది.

ట్విట్టర్ ఆదాయం ఎంత?

2020 సంవత్సరంలో ట్విట్టర్ 27.1 వేల కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.4% ఎక్కువ. ట్విట్టర్ తన ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. మొదటిది ప్రకటనల నుండి వచ్చే ఆదాయం, రెండవది లైసెన్సింగ్, ఇతర సేవల నుండి వచ్చే ఆదాయం. 2020 లో, ట్విట్టర్ ప్రకటనల నుండి 86% అంటే 23.4 వేల కోట్లు వసూలు చేసింది. ఉత్పత్తులు, ట్వీట్లు , ఖాతాల ప్రమోషన్ ఇందులో ఉంది. ఇది కాకుండా, డేటా లైసెన్సింగ్ అలాగే, ఇతర సేవల నుండి 14% అంటే 3.7 వేల కోట్ల రూపాయలు లభించాయి.

ట్విట్టర్ యూజర్ బేస్..

ట్విట్టర్ 11 మార్చి 2006 న ప్రారంభం అయింది. అప్పటి నుండి దాని ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. 2019 తరువాత, ట్విట్టర్ యొక్క వినియోగదారుల స్థాయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెరిగింది. 2020 నాటికి, ట్విట్టర్‌లో రోజువారీ 186 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇది 2021 మొదటి త్రైమాసికం నాటికి 192 మిలియన్లను దాటింది. నెలవారీ క్రియాశీల వినియోగదారుల గురించి చెప్పుకుంటే కనుక ఈ సంఖ్య 350 మిలియన్లకు మించి ఉంటుంది. ట్విట్టర్ భారతదేశంలో ట్విట్టర్ కు రోజువారీ 1.75 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఉద్రిక్తతలు పెంచిన ఆరు సంఘటనలు..

  1. ఫిబ్రవరి 2021 లో రైతుల ఆందోళన సందర్భంగా, అనేక ఖాతాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాక్ స్వేచ్ఛను ఉటంకిస్తూ ట్విట్టర్ ఈ ఉత్తర్వులను పాటించటానికి నిరాకరించింది.
  2. ఫిబ్రవరిలోనే, ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చే ట్వీట్లను ఇష్టపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేదికలు ట్విట్టర్ విధానాలను ప్రశ్నించాయి.
  3. మే 18 న బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా స్క్రీన్ షాట్ ను ట్వీట్ చేసి కాంగ్రెస్ టూల్ కిట్ అని పిలిచారు. మే 20 న ట్విట్టర్ దీనిని ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ చేసింది. ప్రభుత్వం చెప్పినప్పటికీ, దానిని తొలగించలేదు.
  4. మే 25 న గురుగ్రామ్‌లోని ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. టూల్‌కిట్ కేసులో పోలీసులు విచారణ నోటీసును అతికించారు.
  5. జూన్ 4 న, ట్విట్టర్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా అనేక మంది వ్యక్తుల ఖాతాల నుండి నీలిరంగు గుర్తింపులను తొలగించారు. అయితే, తరువాత వాటిని పునరుద్ధరించారు.
  6. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం మూడుసార్లు నోటీసులు జారీ చేసింది.

చివరికి ప్రభుత్వం సెక్షన్ 79 కింద అందుకున్న రక్షణను ట్విట్టర్‌లో తొలగించింది. ట్విట్టర్ భారతదేశంలో ఇటువంటి మొదటి వేదికగా నిలిచింది. ఇదిలా ఉండగా గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికీ ఈ రక్షణ ఉంది.

Also Read: దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’

Uttar Pradesh: పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..