ప్లాట్ఫాం టిక్కెట్లు బదులుగా జర్నీ టిక్కెట్లు.. బెజవాడ వాసుల సరికొత్త ఐడియా!
దసరా సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్లాట్ఫాం టిక్కెట్లను రూ.10 నుంచి రూ.30 రూపాయలకు పెంచారు. పండుగకు లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతారు. దీంతో రద్దీ ఎక్కువవుతుంది.. అది కంట్రోల్లో పెట్టడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చుట్టాలను, ఫ్రెండ్స్తో పాటు రైల్వే స్టేషన్కు వచ్చేవారు ప్లాట్ఫాం టికెట్ రేట్ను చూసి షాక్ అవుతున్నారు. అయినా ఖంగారు పడకుండా సరికొత్త ప్లాన్స్తో రైల్వే అధికారులను ఖంగు తినిపిస్తున్నారు. ప్లాట్ఫాం టిక్కెట్లు కొనే […]
దసరా సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్లాట్ఫాం టిక్కెట్లను రూ.10 నుంచి రూ.30 రూపాయలకు పెంచారు. పండుగకు లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతారు. దీంతో రద్దీ ఎక్కువవుతుంది.. అది కంట్రోల్లో పెట్టడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చుట్టాలను, ఫ్రెండ్స్తో పాటు రైల్వే స్టేషన్కు వచ్చేవారు ప్లాట్ఫాం టికెట్ రేట్ను చూసి షాక్ అవుతున్నారు. అయినా ఖంగారు పడకుండా సరికొత్త ప్లాన్స్తో రైల్వే అధికారులను ఖంగు తినిపిస్తున్నారు.
ప్లాట్ఫాం టిక్కెట్లు కొనే బదులు తక్కువ దూరంకు ప్రయాణికులు జర్నీ టిక్కెట్లు కొనడం ప్రారంభించారు. దీనితో పాసెంజర్ రైల్ టిక్కెట్ల అమ్మకాలు జోరు పెరిగితే.. ప్లాట్ఫాం టిక్కెట్ల కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది మీకు అర్ధమయ్యేలా చెబుతాను. ఉదాహరణంకు పాసెంజర్ రైల్లో తక్కువ దూరానికి టికెట్ ధర 10 రూపాయలు ఉంటుంది. కాబట్టి రూ.30 పెట్టి ప్లాట్ఫాం టికెట్ కొనే బదులు.. రూ.10లతో రైలు టికెట్ కొనడం ఈజీ అని విజిటర్స్ అందరూ అటు వైపు మళ్లారు.
ఒక్కసారిగా గుంటూరు, బెజవాడ ప్రాంతాల్లో సాధారణ రైలు టిక్కెట్ల అమ్మకాలు జోరు పెరగడంతో అధికారులు ఆరా తీయగా.. ఈ విషయం తేటతెల్లమైంది. దీనితో వారు ఖంగుతిన్నారు. రద్దీని తగ్గించాలని అధికారులు టిక్కెట్ల రేట్లు పెంచితే.. ప్రజలు సరికొత్త ఐడియాకు పురుడు పోసి వాటిని ఇలా ఉపయోగించుకుంటారు. వాట్ ఏ ఐడియా సర్ జీ..!