కర్నూలులో హైకోర్టుకు ఓకే కానీ..: అఖిలప్రియ
కర్నూలులో హైకోర్టును స్వాగతించారు మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ. అయితే దీనివల్ల సీమ అభివృద్ధి చెందుతుందా అని ఆమె ప్రశ్నించారు. నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాల పరిస్థితి ఏంటన్నారు. వీటి గురించి మాట్లాడే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని అఖిలప్రియ ప్రశ్నించారు? ఇదే సమయంలో హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఆ నిర్ణయాన్ని అఖిలప్రియ స్వాగతించారు. కేవలం హైకోర్టు రావడం వల్ల సీమ అభివృద్ధి జరగదని ఆమె వివరించారు. దీనివల్ల ఎకానమీ […]
కర్నూలులో హైకోర్టును స్వాగతించారు మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ. అయితే దీనివల్ల సీమ అభివృద్ధి చెందుతుందా అని ఆమె ప్రశ్నించారు. నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాల పరిస్థితి ఏంటన్నారు. వీటి గురించి మాట్లాడే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని అఖిలప్రియ ప్రశ్నించారు? ఇదే సమయంలో హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఆ నిర్ణయాన్ని అఖిలప్రియ స్వాగతించారు. కేవలం హైకోర్టు రావడం వల్ల సీమ అభివృద్ధి జరగదని ఆమె వివరించారు. దీనివల్ల ఎకానమీ పెరుగుతుందా? ఉద్యోగాలు వస్తాయా? అని ఆమె నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ధ్యేయమని ఆమె వివరించారు. రాజధానిపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా జీఎన్.రావు కమిటీతో నివేదిక ఇప్పించారని అఖిలప్రియ మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.