AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సైబర్ టవర్స్ సిగ్నల్ పాయింట్ లో యువకుల పాడు పని!!

మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే దారిలో సగటు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల కోసం ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు... నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడమే ఆ బాక్స్ లో కూర్చుని ట్రాఫిక్‌ పోలీసులు చేయాల్సిన పని...కానీ, ఇక్కడ ఓ ఇద్దరు యువకులు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Hyderabad: సైబర్ టవర్స్ సిగ్నల్ పాయింట్ లో యువకుల పాడు పని!!
Cyber Towers Signal Point
Vijay Saatha
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 22, 2023 | 9:35 PM

Share

నిత్యం వందలాదిమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ తో బిజీగా ఉండే హైదరాబాద్  హై టెక్ సిటి సైబర్ టవర్స్ ముందు ఇద్దరు వ్యక్తులు చేసిన పని అందరికీ చిరాకు తెప్పించింది. సదరు మహానుభావులు చేసిన పనిని కొందరు స్థానికులు వీడియోలు తీశారు. అదే వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో మండిపోతున్నారు. చేతికి దొరికితే ఉతికి ఆరేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ వాళ్లు చేసిన ఆ పాడు పనేంటంటే..

మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే దారిలో సగటు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల కోసం ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు… నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడమే ఆ బాక్స్ లో కూర్చుని ట్రాఫిక్‌ పోలీసులు చేయాల్సిన పని…కానీ, ఇక్కడ ఓ ఇద్దరు యువకులు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. వారు చేసిన పనికి కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సిన చోట ఇద్దరు యువకులు చేరి దర్జాగా మందు కొడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ వారిని ఎవరూ పట్టించుకోకపోవటం అక్కడ కలకలం గా మారింది … పోలీసులు ట్రాఫిక్ రెగ్యులెటరీ కోసం ఉండాల్సిన వాళ్లు లేకపోవడంతో అక్కడే మద్యం తాగి బిర్యాని తిని తాపీగా వెళ్లిపోయారు… అక్కడ పనిచేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ ఇదంతా వీడియో తీయడంతో వైరల్ గా మారింది.