ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..
తిరుమల వెంకన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను..శ్రీవారి భక్తులు పొందేందుకు సౌలభ్యం కలిపించింది.
తిరుమల వెంకన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను..శ్రీవారి భక్తులు పొందేందుకు సౌలభ్యం కలిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉండటంతో సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కలికంగా ఆపివేసింది. సర్వదర్శన టోకెన్లు జారీ నిలిపివేతతో టికెట్స్ సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది.
మరోవైపు కరోనాని జయించిన 16 మంది శ్రీవారి ఆలయ అర్చకులుని క్వారంటైన్ సెంటర్ డాక్టర్స్ డిశ్ఛార్జి చేశారు. మరో అర్చకుడు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారి నుంచి కోలుకున్న అర్చకులంతా పది రోజుల తర్వాత విధులకు హాజరుకానున్నారు.