AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ హామీతో జలాల సద్వినియోగం… కేసీఆర్

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి […]

జగన్ హామీతో జలాల సద్వినియోగం... కేసీఆర్
Anil kumar poka
|

Updated on: Jun 19, 2019 | 5:36 PM

Share

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి చుక్కనూ వాడుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811 టీఎంసీలను ఇదివరకటి ఏపీకి కేటాయించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వరదలు, వర్షాల సీజన్ లో ఈ రెండు నదులకు సంబంధించి ప్రతి ఏడాదీ 4,500 టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలోకలుస్తున్నాయి. కేంద్ర జలసంఘం తన రికార్డుల్లో ఇదే విషయాన్ని పేర్కొంది అని ఆయన చెప్పారు. ఈ నదీజలాలను సమానంగా వినియోగించుకోవడానికి అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్రాలూ అంగీకరించాయని, ఈ బృందం తొలి సమావేశం హైదరాబాద్ లో ఈ నెల 27 న జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తరువాతి భేటీ విజయవాడలో జరుగుతుందన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం మైత్రీ పూర్వకంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాల తోడ్పాటుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామన్నారు. గత నాలుగేళ్లలో కర్ణాటకతో మూడు సార్లు మంచి నీటిని ఇచ్చి పుచ్ఛుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఏపీలోని ఇదివరకటి ప్రభుత్వం తెలంగాణతో నదీజలాల పంపకం విషయంలో విభేదాలకు ఆజ్యం పోసిందన్నారు.

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి