AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ హామీతో జలాల సద్వినియోగం… కేసీఆర్

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి […]

జగన్ హామీతో జలాల సద్వినియోగం... కేసీఆర్
Anil kumar poka
|

Updated on: Jun 19, 2019 | 5:36 PM

Share

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి చుక్కనూ వాడుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811 టీఎంసీలను ఇదివరకటి ఏపీకి కేటాయించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వరదలు, వర్షాల సీజన్ లో ఈ రెండు నదులకు సంబంధించి ప్రతి ఏడాదీ 4,500 టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలోకలుస్తున్నాయి. కేంద్ర జలసంఘం తన రికార్డుల్లో ఇదే విషయాన్ని పేర్కొంది అని ఆయన చెప్పారు. ఈ నదీజలాలను సమానంగా వినియోగించుకోవడానికి అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్రాలూ అంగీకరించాయని, ఈ బృందం తొలి సమావేశం హైదరాబాద్ లో ఈ నెల 27 న జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తరువాతి భేటీ విజయవాడలో జరుగుతుందన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం మైత్రీ పూర్వకంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాల తోడ్పాటుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామన్నారు. గత నాలుగేళ్లలో కర్ణాటకతో మూడు సార్లు మంచి నీటిని ఇచ్చి పుచ్ఛుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఏపీలోని ఇదివరకటి ప్రభుత్వం తెలంగాణతో నదీజలాల పంపకం విషయంలో విభేదాలకు ఆజ్యం పోసిందన్నారు.

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..