కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రోషన్ బేగ్ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కేపీసీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్ బేగ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ […]
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రోషన్ బేగ్ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కేపీసీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్ బేగ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు’ ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా రోషన్ బేగ్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తం 25 స్థానాలకు అన్నీటిలోనూ బీజేపీ ఘన విజయం సాధించడంపై రోషన్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ జోకర్ అని రోషన్ బేగ్ తిట్టిపోశారు. దీంతో అధిష్ఠానం వేటు వేసింది.