ఈ నెల 7న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చించనున్న సమావేశం
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్రావు పార్టీ పటిష్టత, నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ మేరకు ఈ నెల 7న ఆదివారం మద్యాహ్నం 2 గంటలకు..
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్రావు పార్టీ పటిష్టత, నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ మేరకు ఈ నెల 7న ఆదివారం మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు
ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
Read more:
తెలంగాణలో నిరుద్యోగులకు శక్కర్ వార్త.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి చేర్చే అవకాశం