AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూది మందు, గోలీలతో అద్భుతం..కరోనా కాలంలో సరికొత్త ప్రయోగం

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో దుర్గమాతను వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అమ్మవారు కరోనాను అంతం చేస్తున్నట్లుగా ప్రతిష్టించి..పూజలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మిగిల్చిన విషాదాన్ని గుర్తుచేసేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు వినూత్న రీతిలో అమ్మవారిని ప్రతిష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు ప్రతిష్టించిన విగ్రహం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. […]

సూది మందు, గోలీలతో అద్భుతం..కరోనా కాలంలో సరికొత్త ప్రయోగం
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2020 | 7:13 PM

Share

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో దుర్గమాతను వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అమ్మవారు కరోనాను అంతం చేస్తున్నట్లుగా ప్రతిష్టించి..పూజలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మిగిల్చిన విషాదాన్ని గుర్తుచేసేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు వినూత్న రీతిలో అమ్మవారిని ప్రతిష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు ప్రతిష్టించిన విగ్రహం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అస్సాంలోని ధుబ్రీకి సంజీబ్‌ బసక్‌ అనే కళాకారుడు వినూత్న రీతిలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టించాడు. వైద్య వ్యర్థాలను ఉపయోగించి దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం తయారీకి ఎక్పైరీ అయిన 30,000 ట్యాబ్లెట్స్‌, సిరంజీలను వాడాడు. సుమారు రెండు నెలలు కష్టపడి దీన్ని తయారుచేసినట్లుగా తెలిపాడు. బసక్ గతంలో మ్యాచ్ స్టిక్స్, వైర్లులాంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి విగ్రహాలను తయారు చేశాడు. కాగా, మెడికల్‌ వేస్ట్‌ను తగ్గించే లక్ష్యంతో ఈ ప్రయోగం చేసినట్లు బసక్‌ వెల్లడించారు. ఈ విగ్రహం ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.