శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే..
అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
Salakatla Brahmotsavam : అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబరు 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సెప్టెంబర్ 23న గరుడ సేవ,24 స్వర్ణ రథం, 26న శ్రీవారి రథోత్సవం, 27 చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అయితే వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి.
సెప్టెంబరు 18: అంకురార్పణం (సాయంత్రం) సెప్టెంబరు 19: ధ్వజారోహణం (సాయంత్రం) సెప్టెంబరు 19: పెద్దశేషవాహనం (రాత్రి) సెప్టెంబరు 20: చిన్నశేషవాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి) సెప్టెంబరు 21: సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం (రాత్రి) సెప్టెంబరు 22: కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహన (రాత్రి) సెప్టెంబరు 23: మోహినీ అవతారం (ఉదయం), గరుడ సేవ (రాత్రి) సెప్టెంబరు 24: హనుమంత వాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గజవాహనం (రాత్రి) సెప్టెంబరు 25: సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి) సెప్టెంబరు 26: శ్రీవారి రథోత్సవం (ఉదయం), అశ్వవాహనం (రాత్రి) సెప్టెంబరు 27: చక్రస్నానం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి)
అక్టోబర్ 16 నుంచి 24వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబరు 20న గరుడ సేవ, 21న పుష్ప పల్లకి, 23న స్వర్ణ రథం, 24న చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించేందుకే టీటీడీ బోర్టు నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే ఆగమసలహాదారులను టీటీడీ సంప్రదించింది.