AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షోరూం సిబ్బందిపై కోపంతో మొబైల్ తగలబెట్టేశాడు

చెన్నైకి చెందిన తలైమలై అనే వ్యక్తి క్రోంపేటలోని ఓ మొబైల్ షోరూంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. పాపం కొత్త మొబైల్ కొన్న సంతోషం.. కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. ఫోన్ పదే పదే మొరాయిస్తోంది.. సరిగ్గా పని చేయడం లేదు. వెంటనే మొబైల్ షోరూంకు వెళ్లిన తలైమలై తన సమస్యను చెప్పి రిపేర్ చేయమని అడిగాడు. మొబైల్‌ను పరిశీలించిన షోరూం సిబ్బంది.. సర్వీస్ సెంటర్‌కు వెళ్లమని చెప్పారు. తలైమలై పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో […]

షోరూం సిబ్బందిపై కోపంతో మొబైల్ తగలబెట్టేశాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2019 | 3:36 PM

Share

చెన్నైకి చెందిన తలైమలై అనే వ్యక్తి క్రోంపేటలోని ఓ మొబైల్ షోరూంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. పాపం కొత్త మొబైల్ కొన్న సంతోషం.. కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. ఫోన్ పదే పదే మొరాయిస్తోంది.. సరిగ్గా పని చేయడం లేదు. వెంటనే మొబైల్ షోరూంకు వెళ్లిన తలైమలై తన సమస్యను చెప్పి రిపేర్ చేయమని అడిగాడు.

మొబైల్‌ను పరిశీలించిన షోరూం సిబ్బంది.. సర్వీస్ సెంటర్‌కు వెళ్లమని చెప్పారు. తలైమలై పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కోపం నషాలానికి అంటడంతో.. షోరూం బయటకు వచ్చాడు. మొబైల్‌… బిల్ కిందపడేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సీన్ చూసిన జనాలు షాక్ తిన్నారు.. ఇష్టంగా కొనుగోలు చేసిన ఫోన్‌ను ఇలా తగలబెట్టడం చూసి జాలిపడ్డారు.