తెలంగాణ లాయర్లకు గుడ్ న్యూస్…ఖాతాల్లో డబ్బు జమ
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సమస్త ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు లాయర్లు కూడా మినహాయింపు కాదు. కోర్టులు పనిచేయకపోవడంతో చాలామంది లాయర్లు, అడ్వకేట్ క్లర్కులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేకుందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ శాఖకు రూ .25 కోట్లు మంజూరు చేసింది. తాజాగా వాటిలో రూ.15 కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేయగా.. ఇ-పేమెంట్ ద్వారా అర్హతగల న్యాయవాదులు, గుమస్తాలకు ఆ డబ్బును […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సమస్త ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు లాయర్లు కూడా మినహాయింపు కాదు. కోర్టులు పనిచేయకపోవడంతో చాలామంది లాయర్లు, అడ్వకేట్ క్లర్కులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేకుందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ శాఖకు రూ .25 కోట్లు మంజూరు చేసింది. తాజాగా వాటిలో రూ.15 కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేయగా.. ఇ-పేమెంట్ ద్వారా అర్హతగల న్యాయవాదులు, గుమస్తాలకు ఆ డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ద్వారా 14,188 మంది లాయర్లకు రూ.10 వేలు చొప్పున.. 1,029 మంది అడ్వకేట్ క్లర్కులకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వ సాయం అందింది.
సికింద్రాబాద్ లోని జ్యుడిషియల్ అకాడమీలో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘ్వేంద్ర సింగ్ చౌహాన్ ఆ మొత్తాలను ఇ-పేమెంట్ ద్వారా వాళ్ల ఖాతాల్లో జమ చేశారు. టెక్నికల్ రీజన్స్ తో 2 వేల అప్లికేషన్లు యాడ్ అవ్వలేదని, వీటికి కూడా నగదు జమ చేస్తామని ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.