Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి పెంచింది. 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు గడువు పొడిగించారు.

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితిని పెంచింది. గతంలో ఇది 34 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రేవంత్ సర్కార్ పొడిగింపుకు మొగ్గు చూపింది. పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ పొడిగింపు వర్తించదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఒక ఏడాది మాత్రమే ఈ జీవో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మరోసారి పెంపు
అయితే తెలంగాణ ఏర్పడ్డాక గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచారు. అది పూర్తయ్యాక మరో రెండేళ్లకు పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఆ గడువు ముగియడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిపై జీవో కూడా జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం గడువు పొడిగించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ కాంగ్రెస్ నేత మానవతారాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. కృత్రిమ నిరుద్యోగ నాయకుల ఉచ్చులో నిరుద్యోగులు పడవద్దని సూచించారు. పోలీస్ సర్వీసుతో పాటు అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీశాఖల్లో ఉద్యోగాలకు 34 ఏళ్ల గరిష్ట వయో పరిమితి నిబంధనే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
