Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 346 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇవి..
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 38,985 పరీక్షలు నిర్వహించగా... 346 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 38,985 పరీక్షలు నిర్వహించగా… 346 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,135కి చేరింది. మరోవైపు కరోనా కారణంగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,561కి పెరిగింది. కొత్తగా వ్యాధి బారి నుంచి కోలుకుని 397 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 2,82,574కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల యాక్టీవ్ కేసులుండగా.. అందులో 2,798 మంది ఐసోలేషన్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం రిలీజ్ చేసిన బులిటెన్లో తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా నేడు రెండో విడత వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 2వ తేదీన తొలి దఫా డ్రై రన్ నిర్వహించిన విషయం తెలిసిందే.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read :
APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్లైన్లోనే !