APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !

ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై  నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరపాలని డిసైడయ్యింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి...

APPSC Recruitment 2021:  కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !
Follow us

|

Updated on: Jan 08, 2021 | 9:02 AM

APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై  నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరపాలని డిసైడయ్యింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ట్యాబ్‌ల ద్వారానే కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించగా…పరీక్ష నిర్వహణ, భద్రత సహా ఇతర టెక్నికల్ అంశాలపై స్పష్టత వచ్చింది.

ఆన్‌లైన్‌ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహిస్తే క్వచ్ఛన్ పేపర్స్ లీకయ్యే అవకాశమే ఉండదని అధికారులు చెబుతున్నారు. దీంతో పర్మనెంట్‌గా ఈ విధానమే అమలు చేయాలని సర్కార్ డిసైడయినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల నోటిఫైడ్‌ పోస్టులకు వన్ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరలో అమల్లోకి తేనున్నట్లు వెల్లడించారు.

Also Read :

Also Read :

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు