పంట కొనుగోలు బాధ్యత సర్కారుదేః కేసీఆర్

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

పంట కొనుగోలు బాధ్యత సర్కారుదేః కేసీఆర్
Follow us

|

Updated on: Oct 06, 2020 | 9:08 PM

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి గింజ ధాన్యం, పత్తిని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. పంట పెట్టుబడి మొదలు.. కొనుగోలు వరకు అన్ని విషయాల్లో సాగుదారునికి అండగా ఉంటామన్న కేసీఆర్.. రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

వానాకాలం పంట కొనుగోలుపై హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో కోటి 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 52 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న సీఎం.. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉండే ఏ- గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు 1,888 రూపాయలు, బి-గ్రేడ్ రకానికి 1,868 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రైతులు.. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సీఎం సూచించారు. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తిని పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏవైన సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..