ఎన్టీఆర్ ఘాట్ వివాదం.. చంద్రబాబు స్పందన
ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వమే చేసిందని చెప్పిన చంద్రబాబు.. ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని తెలిపారు. ఘాట్ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తనకు మీడియాలో చూశాకే తెలిసిందని చెప్పారు. ఇది మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలంకరణ చేయాలని ఆయన […]
ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వమే చేసిందని చెప్పిన చంద్రబాబు.. ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని తెలిపారు. ఘాట్ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తనకు మీడియాలో చూశాకే తెలిసిందని చెప్పారు. ఇది మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలంకరణ చేయాలని ఆయన ఆదేశించారు.
అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను అలంకరించకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి సహా పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం పువ్వులతో కూడా అలంకరించలేదని అసహనానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. ఇకపై తాత జయంతి, వర్ధంతి వేడుకలను తాను దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు. మరోవైపు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఘాట్ను అలంకరించాల్సిన బాధ్యత టీడీపీ అధినేతగా చంద్రబాబుపై ఉందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.