AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ : మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తే..ఆస్తుల జ‌ప్తు…!

ఏపీ ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోప‌నున్న‌ట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. రాష్ట్ర బోర్డ‌ర్ ఏరియాల్లో ముమ్మర చెకింగ్స్ చేస్తూ ఇసుక, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో టెక్నాల‌జీ సైతం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ప‌కడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు వివ‌రించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా విషయంలో ప్ర‌భుత్వం, అధికారులు ఎన్ని […]

ఏపీ : మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తే..ఆస్తుల జ‌ప్తు...!
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 31, 2020 | 9:20 AM

Share

ఏపీ ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోప‌నున్న‌ట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. రాష్ట్ర బోర్డ‌ర్ ఏరియాల్లో ముమ్మర చెకింగ్స్ చేస్తూ ఇసుక, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో టెక్నాల‌జీ సైతం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ప‌కడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు వివ‌రించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా విషయంలో ప్ర‌భుత్వం, అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా, ప్రజల సహకారం తప్పకుండా ఉండాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, ఇసుక రవాణా విషయంలో ఇప్పటివరకు 485 కేసులు నమోదు చేసి… 955 మందిపై కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. అలాగే 730 వాహనాలను సీజ్‌ చేసి 29,629 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడితే ఊహించ‌ని చర్యలు తీసుకుంటామని.. పాత నేరగాళ్లు అయితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్‌ తెరచే ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. వారి ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనకాడమని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేశారు.