AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ మోస్తారు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడకుల మధ్య ఊగిసలాడుతూ  చివరికి స్వల్ప లాభాల్లో ముగిసాయి. మధ్యాహ్నం  నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. 150 పాయింట్లకుపైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్‌ 89 పాయింట్లు లాభంతో  36,725 వద్ద, నిఫ్టీ కేవలం 5 పాయింట్లు  లాభానికి పరిమితమై 11,058 వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా జోరు చూపుతున్న మార్కెట్లలో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో హెచ్చుతగ్గులను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. […]

ఓ మోస్తారు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2019 | 4:43 PM

Share

ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడకుల మధ్య ఊగిసలాడుతూ  చివరికి స్వల్ప లాభాల్లో ముగిసాయి. మధ్యాహ్నం  నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. 150 పాయింట్లకుపైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్‌ 89 పాయింట్లు లాభంతో  36,725 వద్ద, నిఫ్టీ కేవలం 5 పాయింట్లు  లాభానికి పరిమితమై 11,058 వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా జోరు చూపుతున్న మార్కెట్లలో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో హెచ్చుతగ్గులను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ముఖ్యంగా నిఫ్టీ బ్యాంకు సూచీ 1.4శాతం లాభాలతో ముగిసింది. పంజాబ్‌ నేషనల్  బ్యాంకు, బ్యాంక్ ఆఫ్‌ బరోడాల షేర్లు లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీ కూడా 0.6శాతం లాభాలతో క్లోజ్‌ అయింది. బీఎస్ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీ ఎల్‌ అండ్‌ టి కంపెనీ షేరు విలువ 2.76 శాతం పెరిగి రూ.1,351 వద్ద స్థిరపడింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిర్మాణ కాంట్రాక్టులు దక్కడమే ఈ షేరు విలువ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.  ఇక ఆసియా మార్కెట్లు ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ సంవత్సరం నెమ్మదిస్తుందన్న వార్తలతో మిశ్రమంగా కదలాడాయి.