AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలబ్రిటీ కపుల్ సాయం..ఎందరికో అయ్యారు ఆదర్శం!

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తమ మంచి మనుసును చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ ట్విటర్‌ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనీపై రితేష్‌ దేశ్‌ముఖ్‌ రీ ట్వీట్ చేశారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని […]

సెలబ్రిటీ కపుల్ సాయం..ఎందరికో అయ్యారు ఆదర్శం!
Riteish Deshmukh
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2019 | 8:37 PM

Share

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తమ మంచి మనుసును చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ ట్విటర్‌ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

దీనీపై రితేష్‌ దేశ్‌ముఖ్‌ రీ ట్వీట్ చేశారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నా మనసును, జెనీలియా మనసును చలింపజేశాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని కలసి ‘దేశ్‌ ఫౌండేషన్‌’ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్‌ దేవేంద్ర ఫడ్నవీస్‌ జీ’ అని ఆయన ట్వీట్లు చేశారు.