లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించింది ఎందుకంటే…
కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ మాత్రమే ప్రధానం ఆయుధంగా భావిస్తోంది కేంద్రం. అందుకే తొలి విడుతలో భాగంగా మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యాప్తి విషయంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మెరుగైన ఫలితాలే ఉన్నా కూడా..పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 10వేల మార్క్ దాటింది. రాష్ట్రాలలో కూడా రోజురోజుకు కేసులు పెరిగిపోవడంతో… ఆంక్షలు కొనసాగించడం తప్పనిసరిగా మారింది. లాక్డౌన్ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో పలు […]
కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ మాత్రమే ప్రధానం ఆయుధంగా భావిస్తోంది కేంద్రం. అందుకే తొలి విడుతలో భాగంగా మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యాప్తి విషయంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మెరుగైన ఫలితాలే ఉన్నా కూడా..పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 10వేల మార్క్ దాటింది. రాష్ట్రాలలో కూడా రోజురోజుకు కేసులు పెరిగిపోవడంతో… ఆంక్షలు కొనసాగించడం తప్పనిసరిగా మారింది. లాక్డౌన్ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది కేంద్రం.
స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంతనాలు జరిపారు. అందరూ పొడిగింపుకే మొగ్గు చూపడంతో…వారి అభిప్రాయాల అనంతరం..మోదీ ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఊహించని విధంగా మే 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రాష్ట్రాలు కోరినదానికన్నా 3 రోజులు ఎక్కువగా లాక్డౌన్ కొనసాగించడానికి ఓ రీజన్ ఉంది.మే 1… కార్మిక దినోత్సవం, పబ్లిక్ హాలిడే. మే 2 శనివారం, మే 3 ఆదివారం. ఈ 3 రోజులు ఎలాగో సెలవులే కాబట్టి… లాక్డౌన్ను అప్పటివరకు పొడిగించడమే మేలని భావించింది కేంద్రం. దీంతో మొత్తంగా భారత్ 40 రోజులు లాక్డౌన్లో ఉంటుంది.