రఫేల్‌ డీల్‌..సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

ఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్‌ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై.. కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా తీర్పును సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా కేసు విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని […]

రఫేల్‌ డీల్‌..సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 10, 2019 | 1:31 PM

ఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్‌ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై.. కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా తీర్పును సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా కేసు విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వాస్తవానికి గతేడాది రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.

కాగా రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ది హిందూ పత్రిక ప్రచురించగా ఆ పత్రాలను రివ్యూ పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ పత్రాల ప్రాతిపదికన విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగలించి వాటి ఫొటో కాపీలను కోర్టుకు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవడంతో  పాటు ఇలాంటి పనుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కేంద్రం వాదించింది. అలా అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును రివ్యూ చేయడం సరికాదని పేర్కొంది. వాదోపవాదాలు విన్న అనంతరం కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను న్యాయస్థానం కొట్టివేసింది.