సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ఒక లుక్కేయండి!

July 3, 2026

Subhash

జూలై 1 నుంచి పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా షేర్ అవుతోంది. దీంతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన, అయోమయం నెలకొంది.

అసలేం జరుగుతోంది?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోగోతో ఉన్న ఒక నోటీసు ఇందుకు కారణం. ఆర్‌బీఐ ప్రకారం 2005 కంటే ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ పాత నోట్లను జూన్ 30 తర్వాత మార్కెట్‌లో తీసుకోరని ఆ మెసేజ్‌లో ఉంది.

 వైరల్

కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ అయిన 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) దీనిపై దర్యాప్తు చేసి, ఈ నోటీసు పూర్తిగా నకిలీదని (Fake News) తేల్చి చెప్పింది.

అసలు నిజం ఇదీ

పాత కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ RBI ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. 2005 కంటే ముందున్న నోట్లు ఇప్పటికీ, మున్ముందు కూడా చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ ఏం చెప్పింది?

తమ బ్యాంక్ లోగోతో సర్క్యులేట్ అవుతున్న ఆ నకిలీ నోటీసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా ప్రకటించింది. ఇటువంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

గతంలో ఆర్‌బీఐ మెరుగైన సెక్యూరిటీ కోసం కొత్త నోట్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి, 2005 నాటి పాత నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి మార్చుకోవాలని సూచించింది. కానీ వాటిని ఎప్పుడూ రద్దు చేయలేదు.

నోట్ల మార్పిడి

ఇలాంటి ఆర్థిక పరమైన విషయాల్లో సోషల్ మీడియా పుకార్లను నమ్మి మోసపోకండి. ఎల్లప్పుడూ ఆర్‌బీఐ లేదా మీ బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లు, ప్రకటనలను మాత్రమే నమ్మండి.

జాగ్రత్త

మిమ్మల్ని మోసగించేందుకు రకరకాల న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తూ వినియోగదారులను మోగిస్తున్నారు.

పెరుగుతున్న మోసాలు