AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రక్షాళన దిశగా బీజేపీ జాతీయ కార్యవర్గం.. అమిత్ షాతో అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కొత్త కేంద్ర బృందం ఏర్పాటు, జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురువారం (జూన్ 02) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రక్షాళన దిశగా బీజేపీ జాతీయ కార్యవర్గం.. అమిత్ షాతో అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక భేటీ
Nitin Nabin Meets Amit Shah
Balaraju Goud
|

Updated on: Jul 03, 2026 | 8:32 AM

Share

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కొత్త కేంద్ర బృందం ఏర్పాటు, జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురువారం (జూన్ 02) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అమిత్ షా నివాసంలో సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముగ్గురు నేతల మధ్య జరిగిన చర్చల్లో కొత్త కేంద్ర బృందం రూపకల్పనతో పాటు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, నితిన్ నబిన్ నేతృత్వంలోని కొత్త కేంద్ర బృందంలో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో పాటు యువ నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలు, పార్టీ విస్తరణ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అనుభవం, యువశక్తి రెండింటినీ సమన్వయం చేసే విధంగా కొత్త బృందాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న కొందరు నేతలను సంస్థాగత బాధ్యతల కోసం తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే అవకాశాలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వారికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్, పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రాల వారీగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయడం వంటి అంశాలు కొత్త కేంద్ర బృందం ప్రధాన లక్ష్యాలుగా ఉండే అవకాశం ఉంది.

బీజేపీ కొత్త కేంద్ర బృందంలో చోటు దక్కనున్న నాయకుల పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేంద్ర సంస్థాగత వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us