AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా

అమిత్ షా

అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్‌గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.

ఇంకా చదవండి

దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. మెరుపు ఆపరేషన్‌తో దొరికిపోయిన 253 మంది టెర్రరిస్టులు!

స్వాతంత్ర్య దినోత్సవం ముందు దేశవ్యాప్తంగా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్ (SBN)కు చెందిన 253 మంది టెర్రరిస్టులను 14 రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. ఐఈడీ దాడులు, లక్షిత హత్యలకు పన్నాగం పన్నిన ఈ నెట్‌వర్క్ కుట్రను భద్రతా సంస్థలు సమన్వయంతో ఛేదించాయి. ఉగ్రవాదంపై కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేసింది.

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!

బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు లభించాయి. స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, కొత్త టీమ్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇది పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రతిబింబిస్తుంది.

సైనికుల త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకం.. కార్గిల్ వీరులకు ప్రధాని మోదీ వందనం

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర సైనికులకు యావత్ దేశం ఘన నివాళులు అర్పిస్తోంది. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకున్నారు.

పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?

దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో గాని, రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్‌నినో ఫియర్. వాతావరణం వేడెక్కి, ఉరుములు మెరుపులతో తల్లడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ వర్సెస్ మోదీ.. మైండ్‌గేమ్‌తో ఢిల్లీలో హైటెంపరేచర్లు.. 2026 జూలై 20... మోదీ సర్కార్‌కి ఒకరకంగా అండర్‌లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగసవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్‌డీఏ ప్రభుత్వం, మళ్లీ ఈ సెషన్‌లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో పెర్ఫామ్ చేయాలని డిసైడైంది కూడా ఈరోజే. కానీ, మోదీ టీమ్ ఎంత గొప్ప కాన్ఫిడెన్స్‌తో సభకు వచ్చిందో, అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపలా, వెలుపలా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్‌ మార్కులు ఎదురయ్యాయి. దీటుగా ఢీకొని, వింటర్ సెషన్ మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్‌డీఏ సంకల్పం. కానీ, ఆగస్ట్ 13 వరకూ మొత్తం 19 వర్కింగ్‌డేస్‌లో జరిగే పార్లమెంటు వానాకాలం సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు, మెరుపులు? వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది..? జంతర్‌మంతర్‌ పరిసరాల్లో టెన్షన్‌ఫ్రీ ఎట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేటౌతుంది? వాడీవేడిగా ఢిల్లీ ఫైల్స్..

Vande Mataram: పార్లమెంట్‌లో ‘వందేమాతరం’ బిల్లు?.. అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్షకు ప్రతిపాదన!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాటిలో అత్యంత చర్చనీయాంశంగా మారిన 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026' కూడా ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే, 'వందేమాతరం' గీతాన్ని అవమానించడం, ఆలపించడాన్ని, వాయించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది.

ప్రక్షాళన దిశగా బీజేపీ జాతీయ కార్యవర్గం.. అమిత్ షాతో అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కొత్త కేంద్ర బృందం ఏర్పాటు, జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురువారం (జూన్ 02) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజ్యసభలో పెరుగుతున్న బీజేపీ బలం.. మూడింట రెండు వంతుల మెజారిటీ దిశగా ఎన్డీఏ..!

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇప్పుడు రాజ్యసభలోనూ తన బలాన్ని మరింత పెంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో, ఆ కూటమి సంఖ్యాబలం గణనీయంగా పెరిగింది. దీంతో భవిష్యత్తులో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా బీజేపీ మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

అన్నామలై సంచలన నిర్ణయం.. అమిత్‌షాకు 5 పేజీల రాజీనామా లేఖ.. ట్విస్ట్ ఇచ్చిన అధిష్ఠానం!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కె. అన్నామలై తన పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ సమర్పించారు. దాదాపు ఐదు పేజీలతో కూడిన ఈ లేఖలో ఆయన తన నిర్ణయానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్‌లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.

West Bengal Election: ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. బీజేపీ బటన్‌పై టేపు.. రంగంలోకి ఈసీ!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. పోలింగ్ సాగుతున్న సమయంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్, భద్రతా దళాల లాఠీఛార్జ్ ఘటనలు కలకలం రేపాయి.

ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌.. పశ్చిమ బెంగాల్‌ సెకండ్‌ ఫేజ్‌ పోలింగ్‌ షురూ..!

పశ్చిమ బెంగాల్‌లో రెండవ, చివరి దశ పోలింగ్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రారంభమైంది. ఈ రెండవ దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో, 152 స్థానాలలో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ రెండవ దశలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.