అమిత్ షా
అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.
విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 3:03 pm
ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 5:53 pm
West Bengal Election: ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. బీజేపీ బటన్పై టేపు.. రంగంలోకి ఈసీ!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. పోలింగ్ సాగుతున్న సమయంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్, భద్రతా దళాల లాఠీఛార్జ్ ఘటనలు కలకలం రేపాయి.
- Balaraju Goud
- Updated on: Apr 29, 2026
- 1:23 pm
ఫుల్లీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ షురూ..!
పశ్చిమ బెంగాల్లో రెండవ, చివరి దశ పోలింగ్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రారంభమైంది. ఈ రెండవ దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో, 152 స్థానాలలో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ రెండవ దశలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.
- Balaraju Goud
- Updated on: Apr 29, 2026
- 8:38 am
భారీ భద్రత మధ్య ప్రారంభమైన ‘మినీ పోరు’..! తొలి గంటల్లోనే బెంగాల్, తమిళనాడులో భారీగా పోలింగ్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ల వద్ద పొడవైన బారులు తీరాయి. బెంగాల్లో మమతా బెనర్జీ విశ్వసనీయత ప్రమాదంలో పడగా, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఉదయం 9 గంటల వరకు ఉన్న ఓటింగ్ గణాంకాలను విడుదల చేసింది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:44 am
వ్యూహప్రతివ్యూహాల మధ్య బెంగాల్ ఎన్నికల రణం.. తొలి దశలో 3.6 కోట్ల మంది ఓటర్ల తీర్పు!
పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (ఏప్రిల్ 23, 2026) ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలు బెంగాల్ వర్తమానంతో పాటు భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:28 am
మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!
2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 9:45 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2029 వరకు జరిగే అన్ని ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అఖిలేష్ యాదవ్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 7:36 pm
Parliament LIVE: దేశ రాజకీయాల్లో సూపర్ బిగ్డే..! పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు.. లైవ్ వీడియో
దేశ రాజకీయాల్లో ఇవాళ సూపర్ బిగ్డే..! ఈరోజే పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ముందుకు రానుంది.. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు పడనుంది.. డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటోన్నాయి.. అయితే.. దశాబ్దాలనాటి 33శాతం మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం దాల్చనుంది. మహిళా బిల్లుకు మాత్రం విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 16, 2026
- 11:03 am
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 5:39 pm
అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా
బెంగాల్లోని చట్టానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అవినీతి కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:21 pm
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm