అమిత్ షా
అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.
మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!
2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 9:45 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2029 వరకు జరిగే అన్ని ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అఖిలేష్ యాదవ్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 7:36 pm
Parliament LIVE: దేశ రాజకీయాల్లో సూపర్ బిగ్డే..! పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు.. లైవ్ వీడియో
దేశ రాజకీయాల్లో ఇవాళ సూపర్ బిగ్డే..! ఈరోజే పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ముందుకు రానుంది.. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు పడనుంది.. డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటోన్నాయి.. అయితే.. దశాబ్దాలనాటి 33శాతం మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం దాల్చనుంది. మహిళా బిల్లుకు మాత్రం విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 16, 2026
- 11:03 am
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 5:39 pm
అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా
బెంగాల్లోని చట్టానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అవినీతి కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:21 pm
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
లోక్సభలో దుమారం రేపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ సభ్యులు
చైనాతో సరిహద్దు వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. బీజేపీ సభ్యుల నినాదాల మధ్య రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను రాహుల్ప ప్రస్తావించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దేశాన్ని , సైన్యాన్ని రాహుల్ పదేపదే అవమానిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ కూడా రాహుల్ తీరును తప్పుపట్టారు.
- Balaraju Goud
- Updated on: Feb 2, 2026
- 3:35 pm
ఇకపై, ఉగ్రవాదుల ఆటలు సాగవు.. దేశంలోనే మొట్టమొదటి IED డేటా వ్యవస్థను ప్రారంభించి అమిత్ షా
దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి కీలక ముందడుగు పడింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ IED డేటా నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (జనవరి 09) ప్రారంభించారు. వర్చువల్గా మనేసర్లోని NSG గారిసన్ నుండి డేటా సెంటర్కు శ్రీకారం చుట్టారు.
- Balaraju Goud
- Updated on: Jan 9, 2026
- 7:30 pm
వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు డీఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఆదివారం పుదుక్కోట్టైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jan 4, 2026
- 9:39 pm
ఒకే వేదికపైకి అమిత్ షా , మోహన్ భగవత్.. ఎక్కడ కలుసుకోబోతున్నారంటే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సంచాలక్ మోహన్ భగవత్ ఒకే వేదికపై కలుసుకోబోతున్నారు. శుక్రవారం(డిసెంబర్ 12) ఇద్దరు నేతలు అండమాన్ - నికోబార్ దీవులను సందర్శించనున్నారు. అండమాన్లోని విజయపురంలో వీడీ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 13 సాయంత్రం విజయపురంలోని ఐటీఎఫ్ మైదానంలో జరిగే బహిరంగ ర్యాలీలో మోహన్ భగవత్ ప్రసంగించే అవకాశం ఉంది.
- Balaraju Goud
- Updated on: Dec 11, 2025
- 9:55 pm
వేదిక ఏదైనా టార్గెట్ అదే.. రేరెస్ట్ సిట్యువేషన్ని హోంమంత్రి అమిత్ షా ఇలా వాడేసుకున్నారా?
మార్చి 31, 2026.. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎండ్కార్డ్ పడాల్సిన రోజు. ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం. కేంద్ర హోంమంత్రి జారీ చేసిన హుకుం ఇది..! మహా అయితే నాలుగు నెలలే గ్యాప్ ఉంది. మరి, లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం.. నాకిప్పుడే తెలియాలి అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. అందుకోసం అనఫీషియల్గా ఓ స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారా?
- Balaraju Goud
- Updated on: Nov 21, 2025
- 7:03 am
Chhattisgarh: మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా కీలక నిర్ణయం..!
ఛత్తీస్గఢ్లో ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.. ఈ టైమ్లో ఛత్తీస్గఢ్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మూడు రోజుల పాటు రాయ్పూర్లో మోదీ, అమిత్ షా అక్కడే బస చేయనున్నారు. ఆల్ ఇండియా డీజీపీ సదస్సును నిర్వహించబోతున్నారు. మావోయిస్టుల ఏరివేత ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది.
- Vijay Saatha
- Updated on: Nov 20, 2025
- 8:30 am