AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా

అమిత్ షా

అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్‌గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.

ఇంకా చదవండి

వేదిక ఏదైనా టార్గెట్ అదే.. రేరెస్ట్ సిట్యువేషన్‌ని హోంమంత్రి అమిత్ షా ఇలా వాడేసుకున్నారా?

మార్చి 31, 2026.. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎండ్‌కార్డ్ పడాల్సిన రోజు. ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం. కేంద్ర హోంమంత్రి జారీ చేసిన హుకుం ఇది..! మహా అయితే నాలుగు నెలలే గ్యాప్ ఉంది. మరి, లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం.. నాకిప్పుడే తెలియాలి అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అందుకోసం అనఫీషియల్‌గా ఓ స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారా?

Chhattisgarh: మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా కీలక నిర్ణయం..!

ఛత్తీస్‌గఢ్‌లో ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.. ఈ టైమ్‌లో ఛత్తీస్‌గఢ్‌‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో మోదీ, అమిత్ షా అక్కడే బస చేయనున్నారు. ఆల్ ఇండియా డీజీపీ సదస్సును నిర్వహించబోతున్నారు. మావోయిస్టుల ఏరివేత ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది.

కాషాయ దళం కీలక నిర్ణయం.. కేంద్ర కేబినెట్‌తోపాటు పార్టీలో భారీ ప్రక్షాళన..!

బీహార్ ఫలితాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది ఎన్డీయే సర్కార్. రెండు అంశాలపై కీలకంగా దృష్టిపెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జాతీయ అధ్యక్షుడి ఎంపికని ఫైనల్‌ చేయటంతో పాటు.. కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది. అదే సమయంలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలపై వ్యూహాలకు పదునుపెట్టబోతోంది.

‘ఐ-20 కారులో పేలుడు.. ప్రతి కోణాన్ని పరిశీలిస్తాము’: హోంమంత్రి అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు అమిత్ వెల్లడించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సమీపంలోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

జీమెయిల్ కు గుడ్ బై చెప్పి, జోహో మెయిల్ కు మారిన హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం (అక్టోబర్ 8, 2025) తన అధికారిక ఇమెయిల్ చిరునామాను మార్చుకున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో అధికారిక పోస్ట్‌లో, తాను ఇప్పుడు Gmailకు బదులుగా Zoho మెయిల్‌ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా అధికారిక 'X' పోస్ట్‌లో ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

Amit Shah: లొంగిపోవాల్సిందే.. మావోయిస్టులతో మాట్లాడటానికి ఏమీ లేదు: అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు అమిత్‌షా. బస్తర్‌లో ఆయుధాలు పట్టిన యువత సరెండర్‌ కావాలని పిలుపునిచ్చారు. మార్చి 31 , 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా అమిత్ షా శనివారం బస్తర్‌లో దసరా దర్బార్‌కు హాజరయ్యారు.

భాగ్యనగరానికి అమిత్ షా.. తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరం గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అమిత్ షా స్వామి కార్యంతో పాటు పార్టీ కార్యం కూడా పూర్తి చేసే ప్లాన్ తో వస్తున్నట్ల తెలుస్తోంది. ఇంతకీ షా సడెన్ సౌత్ ట్రిప్ కు కారణమేంటి..? తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఆసక్తికరంగా మారిన అమిత్ షా హైదరాబాద్ పర్యటన..!

బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం..!

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. మరో నెల రోజుల్లో జాతీయ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది..2024 జులైలోనే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో డిసెంబర్ లో ప్రారంభమైన బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగియనుంది.

ఇక జైలుకు వెళ్తే.. పదవి ఊడినట్లే.. సీఎం టూ పీఎం.. మంత్రులకూ వర్తింపు..!

ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను.. కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవులనుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి, బెయిల్ పొందకపోతే వారు వెంటనే పదవిని వదులుకోవాలి. 30 రోజుల తర్వాత కూడా రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లు పరిగణిస్తారు.

Amit Shah: చరిత్ర సృష్టించిన అమిత్‌ షా.. అత్యధిక కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు

హోంమంత్రి అమిత్ షా కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2,258 రోజులు హోంమంత్రిగా పనిచేసిన అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రికార్డును బద్దలు కొట్టారు. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా నిలిచారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రెండవసారి అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.