Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా

అమిత్ షా

అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్‌గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.

ఇంకా చదవండి

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ.. ప్రధాన చర్చ అదేనా?

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

జలియన్‌వాలాబాగ్ ఊచకోత అమరవీరులను స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

జలియన్ వాలాబాగ్ ఊచకోత అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భవిష్యత్ తరాలు అజేయ ధైర్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాయని ఆయన అన్నారు. ఇది నిజంగా మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. వారి త్యాగం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు తిరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

Amit Shah: ఆట మొదలుపెట్టిన అమిత్‌షా.. ఉత్కంఠ రేపుతోన్న తమిళనాడు పర్యటన!

తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటది?. అమిత్‌షా టూర్‌ వెనకున్న సీక్రెట్‌ ఏంటి?

Telangana BJP: తెలంగాణ బీజేపీపై షా ఎఫెక్ట్‌.. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రివర్స్ గేర్.. అసలేం జరిగిందంటే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు అమిత్‌ షా. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర బీజేపీ విధానాన్ని అమిత్‌ షా ప్రశ్నించారట. ఈ అశంలో కేంద్ర పార్టీ విధానం ఏంటి? మీరు వ్యవహరిస్తున్న తీరు ఏంటని తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు అమిత్‌ షా.. దీంతో టీబీజేపీ నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇది కాస్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా ధర్మశాల?: అమిత్ షా

మన దేశానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు,ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలుసుకోవడం ముఖ్యం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ బిల్లు తర్వాత ప్రతి విదేశీ పౌరుడి గురించి ఒక నిఘా ఉంటుంది. భద్రతకు ముప్పు కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో ఇమ్మిగ్రేషన్, విదేశీయుల బిల్లు 2025ను వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.

Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ..

కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేంద్రం .. విపక్షాల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది.

Language War: దేశంలో మరోసారి ప్రాంతీయం వర్సెస్ జాతీయం..! ఎందుకీ లాంగ్వేజ్‌వార్.. గతాన్ని పరిశీలిస్తే..

సీఎం స్టాలిన్‌ రాజేస్తున్న భాషా ఉద్యమం ఓ నిప్పురవ్వగానే కనిపిస్తుండొచ్చు. కానీ, దక్షిణాదితో పాటు ఉత్తరాదికి కూడా దావానలంలా వ్యాపించబోతోంది. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు ఈ భాషా గొడవలు జరిగాయి. రెండేళ్ల క్రితం సింగర్‌ మంగ్లీపై దాడి జరిగింది గుర్తుందా. బళ్లారి ఉత్సవాల్లో పాటలు పాడమని పిలిస్తే వెళ్లారు. ప్రోగ్రామ్‌లో పాటలు పాడింది, అంతా బాగానే జరిగింది. కాని, తిరిగి వెళ్తున్నప్పుడు.. ఉన్నట్టుండి ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరో రాళ్లు విసిరారు.

32 మంది బీజేపీ నాయకుల భద్రతను తొలగించిన కేంద్ర హోం శాఖ..!

పశ్చిమ బెంగాల్‌లోని 32 మంది భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుల భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 26) ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్ష కమిటీ ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది బీజేపీ నాయకుల పేర్లు ఉన్నాయి.

మాజీ సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది.. రక్షణ కల్పించండి.. ప్రధాని మోదీకి వైసీపీ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పంచాయితీ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా? అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే జగన్‌కు ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు భద్రత అంశంపైనా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.

PM Modi: ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ.. సహాయక చర్యలపై సమీక్ష..

మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్‌రాజ్‌లో తెల్లవారుజామున రెండున్నర గంటల తర్వాత నుంచి ఘాట్‌లోకి భక్తుల్నిఅనుమతిచ్చారు. ఈ సమయంలో సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 40 మందికిపైగా భక్తులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు.