
అమిత్ షా
అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.
ఉగ్ర ఘటనపై భారత్ వరుస సమీక్షలు.. బెంబేలెత్తిపోతున్న పాక్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఏదో పెద్ద విషయం జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత 4 గంటల్లో జరిగిన నాలుగు ప్రధాన చర్యల ద్వారా ఈ భయాలు మరింత బలపడ్డాయి. భారతదేశం మునుపటిలాగా సరిహద్దు ఉగ్రవాదులను నిర్మూలించడానికి పెద్ద చర్యకు పూనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2025
- 3:46 pm
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గామ్ ఉగ్రవాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ట్రెక్కింగ్ టూరిస్ట్లపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది చనిపోవడంతో యావత్ దేశం విషాదంలో కూరుకుంది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు..అంతేకాకుండా.. 20మందికిపైగా గాయపడ్డారు.. ఈ ఉగ్రచర్యపై ఆక్రోశం వ్యక్తం అవుతోంది. ఈ ఉగ్రవాద ఘటనను కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు..
- Shaik Madar Saheb
- Updated on: Apr 23, 2025
- 9:47 am
ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే ! దాదాపు అభ్యర్థి ఖరారు.. ఎవరంటే?
తెలుగు తంబి అన్నామలై.. అదేంటి? అంటే తమిళ తంబి అనాలి.. లేదంటే తెలుగు తమ్ముడు అనాలి. తెలుగు తంబీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది..ఈ సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది ఎన్డీయే కూటమి. బీజేపీ ఏమో తమిళనాడు నేత, మాజీ పోలీస్ అధికారి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే అన్నామలై తెలుగు తంబీ అయిపోతున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Apr 22, 2025
- 6:30 pm
Terrorist Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా.. అమిత్షాకు కీలక ఆదేశాలు..
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. అమిత్షాను పహల్గామ్కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చింది..
- Shaik Madar Saheb
- Updated on: Apr 22, 2025
- 9:17 pm
ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ.. ప్రధాన చర్చ అదేనా?
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
- Gopikrishna Meka
- Updated on: Apr 16, 2025
- 11:19 pm
జలియన్వాలాబాగ్ ఊచకోత అమరవీరులను స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
జలియన్ వాలాబాగ్ ఊచకోత అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భవిష్యత్ తరాలు అజేయ ధైర్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాయని ఆయన అన్నారు. ఇది నిజంగా మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. వారి త్యాగం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు తిరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 13, 2025
- 12:08 pm
Amit Shah: ఆట మొదలుపెట్టిన అమిత్షా.. ఉత్కంఠ రేపుతోన్న తమిళనాడు పర్యటన!
తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటది?. అమిత్షా టూర్ వెనకున్న సీక్రెట్ ఏంటి?
- Balaraju Goud
- Updated on: Apr 11, 2025
- 10:06 am
Telangana BJP: తెలంగాణ బీజేపీపై షా ఎఫెక్ట్.. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రివర్స్ గేర్.. అసలేం జరిగిందంటే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలకు గట్టి క్లాస్ తీసుకున్నారు అమిత్ షా. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర బీజేపీ విధానాన్ని అమిత్ షా ప్రశ్నించారట. ఈ అశంలో కేంద్ర పార్టీ విధానం ఏంటి? మీరు వ్యవహరిస్తున్న తీరు ఏంటని తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు అమిత్ షా.. దీంతో టీబీజేపీ నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇది కాస్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 29, 2025
- 8:59 am
ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా ధర్మశాల?: అమిత్ షా
మన దేశానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు,ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలుసుకోవడం ముఖ్యం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ బిల్లు తర్వాత ప్రతి విదేశీ పౌరుడి గురించి ఒక నిఘా ఉంటుంది. భద్రతకు ముప్పు కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో ఇమ్మిగ్రేషన్, విదేశీయుల బిల్లు 2025ను వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2025
- 8:10 pm
Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ..
కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేంద్రం .. విపక్షాల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 10, 2025
- 8:12 am